ఇది రోజూ ఒక్కటి తింటే అమితమైన బలం మీ సొంతం?

Purushottham Vinay
మనం ఆహారంగా తినే  పప్పు దినుసుల్లో మినపప్పు కూడా ఒకటి. మినపప్పులో కూడా చాలా రకాల పోషకాలు దాగి ఉన్నాయి. దీనిని తీసుకోవడం వల్ల మనం చాలా ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.ఇక ఈ మినపప్పును మనం ఎక్కువగా అల్పాహారాల తయారీలో వాడుతూ ఉంటాం. కేవలం అల్పాహారాలే కాకుండా మినపప్పుతో మనం బాగా రుచిగా ఉండే సున్నండలను కూడా తయారు చేసుకుని కూడా తినవచ్చు. సున్నండలు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇవి చాలా రుచిగా ఉంటాయి. వీటిని తినడం వల్ల మన ఆరోగ్యానికి ఖచ్చితంగా చాలా మేలు కలుగుతుందనే చెప్పవచ్చు.ఇక రుచిగా ఉండడంతో పాటు చక్కటి ఆరోగ్యాన్ని అందించే సున్నండలను ఎలా తయారు చేసుకోవాలి? వంటి పూర్తి వివరాలని ఇప్పుడు మనం తెలుసుకుందాం.సున్నండల తయారీకి కావల్సిన పదార్థాలు..పొట్టు మినపప్పు అరకిలో, బెల్లం తురుము అరకిలో, నెయ్యి 100 గ్రా.. కావాలి.సున్నండల తయారీ విధానం విషయానికి వస్తే..ముందుగా మీరు కళాయిలో మినపప్పు వేసి వేయించాలి. ఆ


 తరువాత వీటిని మధ్యస్థ మంటపై కలుపుతూ ఎర్రగా అయ్యే దాకా వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి.తరువాత మినపప్పు పూర్తిగా చల్లారిన తరువాత జార్ లోకి తీసుకుని మనకు నచ్చిన రీతిలో మెత్తగా లేదా బరకగా మిక్సీ పట్టుకోవాలి.ఇక ఆ తరువాత మరో జార్ లో బెల్లం తరుమును వేసి పొడిగా అయ్యేలా మిక్సీ పట్టుకోవాలి. తరువాత ఈ బెల్లం పొడిని మినపప్పు మిశ్రమంలో వేసి మరోసారి మిక్సీ చేసుకొని గిన్నెలోకి తీసుకోవాలి. ఆ తరువాత ఇందులో నెయ్యిని వేసి అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి. ఆ తరువాత కొద్ది కొద్దిగా ఈ మిశ్రమాన్ని తీసుకుంటూ ఉండలుగా చుట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల బాగా రుచిగా ఉండే సున్నండలు తయారవుతాయి.పిల్లలకు వీటిని ఇవ్వడం వల్ల వారికి మంచి బలం వస్తుంది.వీటిని తినడం వల్ల రుచితో పాటు సంపూర్ణ ఆరోగ్యాన్ని కూడా సొంతం చేసుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: