లేలేతబుగ్గలను పొందాలంటే ఈ పదార్థాలను వాడాల్సిందే..!

Divya
 ప్రతి ఒక్కరికి పుట్టినప్పుడు బుగ్గలు ఎంతో మెరుపుగా,మృదువుగా,ఎలాంటి మచ్చలు లేకుండా,ఆరోగ్యకరంగా ఉంటాయి. కానీ రానురాను వాతావరణ పొల్యూషన్ వల్ల, శరీరంలో హార్మోనల్ ఇన్ బ్యాలెన్స్ వల్ల, ఆహార పద్ధతులు మరియు జీవనశైలి వంటి కారణాలవల్ల జీవమును కోల్పోతూ ఉంటాయి. దానితో మొహంపై మొటిమలు మచ్చలు మొదలై, అంద విహీనంగా తయారవుతాయి. అలాంటి బుగ్గలను కొన్ని పదార్థాలను వాడటం వల్ల తిరిగి పొందవచ్చని ఆహార నిపుణులు సూచిస్తున్నారు.ఆ ఆహారాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..
శరీరం యవ్వనంగా మార్చడంలోనూ,అందాన్ని రెట్టింపు చేయడంలోనూ,'విటమిన్ ఈ 'చాలా బాగా దోహదపడుతుంది. విటమిన్ ఈ గల ఆహారాలను తీసుకోవడంతో లేలేత బుగ్గలు వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా విటమిన్ ఈ అధికంగా వున్న కలబంద గుజ్జును మొహానికి రాయడం వల్ల,మొటిమలు మచ్చలు తొందరగా తగ్గిపోతాయి. కలబంద గుజ్జును ఆహారంగా తీసుకోవడంతో మంచి ఆరోగ్య ప్రయోజనాలను చేకూరుస్తుంది.
 యాపిల్..
ఆపిల్ ని అధికంగా తినడం వల్ల అందులోని కొల్లాజన్,ఎలాస్టిక్,యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని యవ్వనంగా మార్చడంలో సహాయపడతాయి. ఆహారంగానే కాక,దీని గుజ్జుతో లేపనాలు వేసుకోవడం వల్ల చర్మం మరింత మెరుగుపడుతుంది
 తేనె..
తేనె మనం రాసుకునే లేపనంలో వాడటం వల్ల ఇందులోని యాంటీ బ్యాక్టీరియల్ మరియు మాయిశ్చరైజింగ్ గుణాలు చర్మాన్ని మృదువుగా తయారు చేయడంలో ఉపయోగపడతాయి. తేనెను ఆహారంగాను,ముఖానికి వేసుకునే లేపనాల్లో వాడటం చాలా ఉత్తమం.
 ఆలివ్ ఆయిల్..
ఆలివ్ ఆయిల్ ను ముఖానికి రాసుకుని మర్దన చేసుకోవడం వల్ల, చర్మానికి ఎలాస్టిక్ గుణాలు అందించి,వృద్ధాప్య చాయలు రాకుండా కాపాడుతుంది. బుగ్గలు మృదువుగా తయారవడానికి కూడా చాలా బాగా తోడ్పడుతుంది.
 రోజ్ వాటర్..
రోజ్ వాటర్ ను మొహానికి వేసుకుని ప్యాక్ లలో వాడటం వల్ల, బుగ్గులను గులాబీ రేకులు వలే మృదువుగా తయారు చేయడమే కాక,  మాయిశ్చరైజింగ్ గా కూడా ఉంచుతుంది.
పాలు..
పాలలో లాక్టైజ్, ప్రోటీన్స్ కలంగా ఉంటాయి.వీటిని చర్మం పై రాసి మసాజ్ చేయనుకోవడంతో బుగ్గలు, పిల్లల బుగ్గలు వలె మెరుపును సంతరించుకుంటాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: