పక్షులని పెంచుతున్నారా? అయితే ఈ జబ్బు కన్ఫామ్?

Purushottham Vinay
రీసెంట్ గా ప్రముఖ దక్షిణాది సీనియర్ నటి అయిన మీనా భర్త విద్యాసాగర్‌ మరణించిన సంగతి తెలిసిందే. అయితే ఆయన చనిపోయిన సమయంలో ఓ వార్త మాత్రం బాగా వైరల్‌ అయ్యింది.ఎందుకంటే మీనా భర్త విద్యా సాగర్‌ మరణానికి పావురాలే కారణమని కొన్ని వార్తా కథనాలు వెల్లువడ్డాయి.ఇక మీనా నివసించే ఇంటికి దగ్గరలో చాలా పావురాలు ఉంటాయని.. వాటి వ్యర్థాలు కలిసిన గాలి ఎక్కువగా పీలుస్తుండటంతో ఇంట్లో అందరి లంగ్స్‌కు ఇన్ఫెక్షన్ సోకిందని వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ వార్తలను మీనా కూడా ఖండించారు. అయితే ఆ విషయం పక్కనపెడితే  నిజంగానే పక్షుల కారణంగా మనుషులకు వ్యాధులు వస్తాయా అంటే నిజమేనని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.పక్షుల కారణంగా జనాలు ఖచ్చితంగా 'బర్డ్ బ్రీడర్ లంగ్ డిసీజ్' అనే శ్వాసకోశ సమస్యకు గురయ్యే ప్రమాదం ఉంది. ఈ మధ్య కాలంలో ఢిల్లీలో ఇలాంటి కేసులు కూడా చాలా భారీగా పెరుగుతున్నాయి. ఇక ఈ నేపథ్యంలో అసలీ వ్యాధి ఏంటి.? దాని లక్షణాలు ఎలా ఉంటాయి.? అందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి.? వంటి పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.


ఈ బర్డ్‌ బ్రీడర్‌ లంగ్‌ డిసీజ్‌ అనే వ్యాధిని ఏవియన్ హైపర్సెన్సిటివిటీ న్యూమోనిటిస్ అని కూడా పిలుస్తారు. ముఖ్యంగా కోళ్ల ఫారాలల్లో పనిచేసే వారికి ఇంకా కోళ్ల దుకాణాల్లో పనిచేసే వారికి ఈ వ్యాధి సోకే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కోళ్లు, పక్షుల విసర్జిత పదార్థాల దుమ్ము ఇంకా ఈకల ధూళీకి ఎక్స్‌పోజ్ కావడం వల్ల ఈ వ్యాధి వ్యాపిస్తోందని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు.అందువల్ల ఈ వ్యాధి సోకిన వారిలో శ్వాస తీసుకోవడంలో చాలా ఇబ్బందిగా ఉంటుంది. దగ్గు, జ్వరం, ఛాతి బిగుతుగా అనిపించడం ఇంకా అలసటగా ఉంటుంది. ఈ లక్షణాలు వెంటనే కాకుండా ఏళ్ల వ్యవధిలో కనిపిస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎక్కువ కాలం పాటు ఇలాంటి వాటికి ఎక్స్‌పోజ్‌ అయితే వారిలో లంగ్ టిష్యూ డ్యామేజ్ వంటి సమస్యలు తలెత్తే అవకాశాలు చాలా ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దగ్గు, జ్వరం ఇంకా శ్వాసకోశ ఇబ్బందులతో బాధపడే వారు పక్షులు అలాగే కోళ్లకు దూరంగా ఉండడమే వారి ఆరోగ్యానికి మంచిది. ఒకవేళ వృత్తిపరంగా ఉండాల్సి వస్తే కచ్చితంగా వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: