అనారోగ్య సమస్యలన్నింటిని దూరం చేసే డ్రింక్ ?

Purushottham Vinay
మనకు వచ్చే అనారోగ్య సమస్యలన్నింటిని చాలా సులభంగా దూరం చేసే ఒక అద్భుతమైన పానీయాన్ని ఎలా తయారు చేసుకోవాలి ఇంకా దాని తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి లాంటి పూర్తి వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ పానీయాన్ని తయారు చేసుకోవడానికి మనం అర కప్పు మునగాకును, పావు కప్పు కరివేపాకును, అర చెక్క నిమ్మరసాన్ని ఇంకా అలాగే ఒక టీ స్పూన్ తేనెను ఉపయోగించాల్సి ఉంటుంది. ముందుగా ఒక జార్ లో మునగాకును అలాగే కరివేపాకును తీసుకోవాలి.ఆ తరువాత ఇందులో తగినన్ని నీళ్లు పోసి బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఆ తరువాత ఈ జ్యూస్ ను వడకట్టి ఒక గ్లాస్ లోకి మీరు తీసుకోవాలి.ఆ తరువాత  ఇందులో తేనె ఇంకా నిమ్మరసం వేసి బాగా కలిపి తాగాలి. ఇక షుగర్ వ్యాధితో బాధపడే వారు తేనెను తీసుకోకపోవడమే చాలా మంచిది. ఇలా తయారు చేసుకున్న పానీయాన్ని రోజులో ఏ సమయంలోనైనా కూడా తాగవచ్చు. ఇలా వారం రోజుల పాటు తాగిన తరువాత మరో వారం రోజులు కూడా గ్యాప్ ఇచ్చి తాగాలి.


ఈ విధంగా ఈ పానీయాన్ని తాగడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. ఈ పానీయాన్ని తాగడం వల్ల శరీరంలో రోగ నిరోధక వ్యవస్థ కూడా చాలా బాగా మెరుగుపడుతుంది. అలాగే ఇన్ఫెక్షన్ ల బారిన పడకుండా ఉంటాము. చర్మం ఇంకా జుట్టు ఆరోగ్యంగా ఉంటాయి.కంటి చూపు కూడా మెరుగుపడుతుంది. జీర్ణవ్యవస్థ కూడా చాలా చక్కగా పని చేస్తుంది. రక్తహీనత సమస్య కూడా తగ్గుతుంది. ఇంకా ఎముకలు చాలా ధృడంగా తయారవుతాయి.ఇంకా అలాగే కీళ్ల నొప్పులు కూడా చాలా ఈజీగా తగ్గుతాయి. కండరాలు చాలా గట్టిగా ధృడంగా తయారవుతాయి. రక్తపోటు ఇంకా షుగర్ వంటి సమస్యలు చాలా ఈజీగా అదుపులో ఉంటాయి. ఇంకా అలాగే అధిక బరువుతో బాధపడే వారు ఈ పానీయాన్ని తాగడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చు. ఈ విధంగా మునగాకు ఇంకా కరివేపాకుతో జ్యూస్ ను తయారు చేసుకుని తాగడం వల్ల అనారోగ్య సమస్యలను చాలా ఈజీగా దూరం చేసుకోవడంతో పాటు వాటి బారిన కూడా పడకుండా ఉంటామని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: