మన బాడీలో ఉన్న చెత్తని బయటకి పంపే టిప్?

Purushottham Vinay
మన శరీరంలోని మలినాలను ఈజీగా బయటకి తొలగించే  జ్యూస్ ను తయారు చేసుకోవడానికి ముందుగా మనం క్యారెట్ ను, అల్లం ముక్కలను, నారింజ పండును, పెరుగును ఇంకా అలాగే తేనెను ఉపయోగించాల్సి ఉంటుంది. మీరు ముందుగా నారింజలో ఉండే గింజలను తీసేసి వాటిని ముక్కలుగా చేసుకోవాలి.ఆ ఈ ముక్కలను ఒక జార్ లో వేసుకోవాలి. తరువాత రెండు ఇంచుల అల్లం ముక్కను తీసుకొని దానిని బాగా శుభ్రపరిచి ముక్కలుగా కట్ చేసుకుని జార్ లో వేసుకోవాలి. ఇంకా అదే విధంగా ఒక పెద్ద క్యారెట్ ను కూడా ముక్కలుగా కట్ చేసి ఆ జార్ లో వేసుకోవాలి. తరువాత ఇందులో 2 టేబుల్ స్పూన్ల పెరుగు ఇంకా అలాగే 150 ఎమ్ ఎల్ నీళ్లు పోసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా తయారు చేసుకున్న జ్యూస్ ను మీరు గ్లాస్ లోకి తీసుకోవాలి. ఆ తరువాత ఇందులో ఒక టీ స్పూన్ తేనెను వేసుకొని బాగా కలిపి తాగాలి. కానీ షుగర్ వ్యాధి గ్రస్తులు మాత్రం తేనెను ఉపయోగించకపోవడమే మంచిది.


ఇక ఇలా తయారు చేసుకున్న జ్యూస్ ను తాగడం వల్ల శరీరంలో పేరుకుపోయిన మలినాలు, విష పదార్థాలు ఇంకా అలాగే వ్యర్థ పదార్థాలు ఈజీగా తొలగిపోతాయి. మన అవయవాలు బాగా శుభ్రపడతాయి. ఇంకా మనకి రోగ నిరోధక శక్తి కూడా ఈజీగా పెరుగుతుంది.అలాగే జీర్ణ వ్యవస్థ పెరుగుతుంది. మలబద్దకం సమస్య కూడా ఈజీగా తగ్గుతుంది. అంతేగాక మన శరీరానికి అవసరమయ్యే వివిధ రకాల పోషకాలు కూడా లభిస్తాయి.ఇంకా అలాగే బరువు తగ్గాలనుకునే వారు ఇలా జ్యూస్ ను తయారు చేసుకుని తాగడం వల్ల వారి శరీరానికి అవసరమయ్యే పోషకాలు చాలా పుష్కలంగా లభిస్తాయి.అలాగే ఈ జ్యూస్ ను తాగడం వల్ల కడుపు నిండిన భావన కూడా మీకు కలుగుతుంది. దీంతో మీరు ఎక్కువ ఆహారాన్ని తీసుకోకుండా ఉంటారు. ఈ విధంగా క్యారెట్ , నారింజ పండుతో జ్యూస్ ను తయారు చేసుకుని తాగడం వల్ల రుచితో పాటు చక్కటి ఆరోగ్యాన్ని కూడా మీరు చాలా ఈజీగా సొంతం చేసుకోవచ్చు.కాబట్టి ఖచ్చితంగా ఈ జ్యూస్ చేసుకొని తాగండి. వివిధ రకాల ఆరోగ్య ప్రయోజనాలను సొంతం చేసుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: