పొద్దున్నే ఇది తింటే చాలా హుషారుగా ఉంటారు?

Purushottham Vinay
ఒక గిన్నెలో శనగపప్పు, పెసరపప్పు, కందిపప్పు ఇంకా అలాగే ఎర్రపప్పు వేసి బాగా శుభ్రంగా కడగాలి. ఆ తరువాత తరువాత తగినన్ని నీళ్లు పోసి అరగంట పాటు నానబెట్టాలి. ఆ తరువాత కుక్కర్ లో నెయ్యి వేసి కొంచెం సేపు వేడి చేయాలి. ఆ నెయ్యి వేడయ్యాక అలాగే గోధుమరవ్వ వేసి వేయించాలి. గోధుమ రవ్వను ఎర్రగా అయ్యే దాకా వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇంకా ఆ తరువాత అందులోనే మరో టేబుల్ స్పూన్ నెయ్యి వేసి వేడి చేయాలి.ఆ నెయ్యి వేడయ్యాక జీలకర్ర ఇంకా ఇంగువ వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు వేసి ఎర్రగా అయ్యే దాకా వేయించాలి. తరువాత అల్లం పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే దాకా వేయించాలి. తరువాత కరివేపాకు ఇంకా పచ్చిమిర్చి వేసి వేయించాలి. ఆ పచ్చిమిర్చి చక్కగా వేగిన తరువాత పాలకూరని వేసి కలపాలి. తరువాత క్యారెట్ ముక్కలు ఇంకా అలాగే బఠాణీ వేసి కలపాలి.వీటిని ఒక 2 నిమిషాల పాటు వేయించిన తరువాత ముందుగా నానబెట్టుకున్న పప్పులను అందులో వేసి కలపాలి.


ఆ తరువాత పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి ఇంకా అలాగే జీలకర్ర పొడి వేసి బాగా కలపాలి. తరువాత వీటిని మరో నిమిషం పాటు కలుపుతూ వేయించిన తరువాత టమాట ముక్కలని కూడా వేసి కలపాలి. అలాగే ఆ తరువాత 6 కప్పుల నీళ్లు పోసి కలపాలి. తరువాత  వేయించిన గోధుమ రవ్వను కూడా వేసి కలపాలి. ఇప్పుడు కుక్కర్ పై మూత పెట్టి మధ్యస్థ మంటపై 3 విజిల్స్ వచ్చే దాకా ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత మూత తీసి కొత్తిమీర ఇంకా నిమ్మరసం వేసి కలపాలి. ఇలా చేయడం వల్ల చాలా రుచిగా ఉండే గోధుమ రవ్వ కిచిడీ తయారవుతుంది. దీనిని అల్పాహారంగా లేదా రాత్రి సమయంలో భోజనంగా కూడా మీరు తీసుకోవచ్చు. ఈ విధంగా గోధుమ రవ్వతో కిచిడీని తయారు చేసుకుని తినడం వల్ల రుచితో పాటు మంచి సంపూర్ణ ఆరోగ్యాన్ని కూడా సొంతం చేసుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: