చర్మం కందిపోకుండా ఉండాలంటే..?

Purushottham Vinay
సాధారణంగా ఎండ ఎక్కువగా తగిలిన భాగంలో చర్మం కాలిపోయి ఎర్రగా అవ్వడంతో పాటు నొప్పితో పాటు మంట కూడా కలుగుతుంది. అందుకు వివిధ రకాల క్రీములను, ఆయింట్ మెంట్ లను రాసినా కూడా చర్మం తిరిగి సాధారణ స్థితికి రావడానికి చాలా రోజుల సమయం పడుతుంది. అందుకే ఎండలో బయటకు వెళ్లినప్పటికి చర్మం కందిపోకుండా ఉండాలంటే ద్రాక్ష పండ్లను ఎక్కువగా తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.ఈ ద్రాక్ష పండ్లను తీసుకోవడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు ఖచ్చితంగా ఉంటాయి.జీర్ణవ్యవస్థను మెరుగుపరచడంలో ఇంకా అలాగే మూత్రపిండాల పనితీరును మెరుగుపరచడంలో అలాగే క్యాన్సర్ బారిన పడే అవకాశాలను తగ్గించడంలో, ఆస్టియో ఆర్థరైటిస్ వంటి సమస్యలను ఈజీగా తగ్గించడంలో ఇలా చాలా విధాలుగా ద్రాక్ష పండ్లు మనకు ఎంతగానో ఉపయోగపడతాయి. వీటితో పాటు ద్రాక్ష పండ్లను మూడు పూటలా రెండు వారాల పాటు తీసుకున్న వారికి ద్రాక్ష పండ్లు ఎండ నుండి కూడా చర్మాన్ని సంరక్షిస్తాయన్న విషయం వెల్లడైంది. ద్రాక్ష పండ్లను ఎక్కువగా తీసుకున్న వారి చర్మంపై సూర్యుడు నుండి వచ్చే యువీ కిరణాలు చాలా తక్కువ ప్రభావాన్ని చూపాయని పరిశోధనల్లో తేలింది.


ఈ ద్రాక్ష పండ్లల్లో యువీ కిరణాల నుండి రక్షణ కలిగించే ఫైటో కెమికల్స్ తో పాటు రెస్వెరాట్రాల్ అనే రసాయన సమ్మేళనం ఎక్కువగా ఉంటుంది. ఇది యాంటీ ఆక్సిడెంట్ గా పని చేయడంతో పాటు చర్మానికి ఎటువంటి హాని కలగకుండా కాపాడడంలో కూడా ఎంతగానో సహాయపడుతుంది. ఈ విధంగా ద్రాక్ష పండ్లు ఎండ నుండి చర్మాన్ని కాపాడడంతో పాటు అనేక రకాల ఇతర ప్రయోజనాలను కూడా కలిగిస్తాయి. కాబట్టి ద్రాక్ష పండ్లను తప్పకుండా ఆహారంలో భాగంగా తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు. ఇంకా అలాగే ద్రాక్షలో కూడా అనేక రకాలు ఉంటాయి. ఎటువంటి ద్రాక్షను తీసుకున్నా కూడా మనం చాలా మంచి ఫలితాలను పొందవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎండలో ఎక్కువగా తిరగాల్సి వచ్చిన వారు ద్రాక్ష పండ్లను తీసుకోవడం వల్ల వారి చర్మం కందిపోకుండా ఉండడంతో పాటు చర్మ ఆరోగ్యం కూడా చాలా బాగా మెరుగుపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: