పొద్దున్నే ఈ కషాయం తాగితే ఆరోగ్యానికి మంచిది?

Purushottham Vinay
వేపాకు తినడానికి చేదుగా ఉంటుంది కానీ ఇది చేసే మేలు మాత్రం చాలా తియ్యగా ఉంటుంది. ఈ ఆకుతో కషాయాన్ని చేసుకుని తాగడం వల్ల మనం చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు.ఇక వేపాకులతో కషాయాన్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.ఈ కషాయాన్ని తయారు చేసుకోవడానికి  ముందుగా మీరు గుప్పెడు వేపాకులను తీసుకుని వాటిని శుభ్రంగా కడగాలి. ఆ తరువాత ఒక గిన్నెలో రెండు గ్లాసుల నీళ్లు తీసుకుని వాటిని బాగా వేడి చేయాలి.ఆ నీళ్లు కొద్దిగా వేడయ్యాక వేపాకులను వేసి ఒక గ్లాస్ కషాయం అయ్యే దాకా బాగా మరిగించాలి. ఆ తరువాత ఈ కషాయాన్ని బాగా వడకట్టుకుని ఒక గ్లాస్ లోకి తీసుకోవాలి. ఇలా చేస్తే వేపాకు కషాయం తయారవుతుంది. ఈ కషాయాన్ని ప్రతి రోజూ ఉదయం పూట పరగడుపున తాగడం వల్ల మనం చాలా ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. ఈ కషాయాన్ని తాగడం వల్ల పొట్టలో ఉండే క్రిములు కూడా చాలా ఈజీగా చనిపోతాయి. ఇంకా అలాగే జీర్ణ శక్తి కూడా మెరుగుపడుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలు చాలా ఈజీగా అదుపులో ఉంటాయి. 


శరీరంలో రక్త ప్రసరణ వ్యవస్థ కూడా బాగా మెరుగుపడుతుంది.మీకు రక్తశుద్ది కూడా అవుతుంది. ఈ కషాయాన్ని నోట్లో పోసుకుని పుక్కిలించడం వల్ల నోటి అల్సర్లు కూడా ఈజీగా తగ్గుతాయి. నోటిలో ఉండే క్రిములు చనిపోవడంతో పాటు దంతాల, చిగుర్ల ఆరోగ్యం కూడా బాగా మెరుగుపడుతుంది. అలాగే నీటిలో వేపాకును వేసి బాగా మరిగించాలి. తరువాత ఈ నీటితో రోజూ స్నానం చేయడం వల్ల చర్మ సంబంధిత సమస్యలు కూడా ఈజీగా తగ్గుతాయి. ఇంకా మీ జుట్టు ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. వేప ఆకులతో చేసిన కషాయాన్ని తాగడం వల్ల శరీరంలో వాపులు ఇంకా అలాగే నొప్పులు కూడా చాలా ఈజీగా తగ్గుతాయి. ఇన్ ప్లామేషన్ కూడా తగ్గుతుంది. ఆస్థమా వంటి సమస్యలు కూడా ఈజీగా తగ్గు ముఖం పడతాయి.ఈ విధంగా వేపాకుల కషాయం ఎంతగానో ఉపయోగపడుతుంది.దీనిని ప్రతిరోజూ తాగడం వల్ల మంచి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: