మధుమేహన్ని సులభంగా తగ్గించే పద్ధతులు?

Purushottham Vinay
స్ట్రెస్ కి గురవ్వకుండా..టెన్షన్ తో కూడిన పనులకు మధుమేహం జబ్బు ఉన్నవాళ్లు చాలా దూరంగా ఉండాలి. ఎందుకంటే ఒత్తిడికి గురికావడం వల్ల ఖచ్చితంగా కూడా రక్తపోటుకు గురయ్యే అవకాశం ఉంది. గుండెపోటు లేదా గుండె సంబంధిత వ్యాధులకు గురయ్యే ఛాన్స్ కూడా చాలా ఎక్కువుగా ఉంది. అందుకే ఒత్తిడికి లోనుకాకుండా ప్రతిరోజూ కూడా ఖచ్చితంగా 8 గంటలకు తక్కువ కాకుండా నిద్రపోవాలి. అలాగే మనస్సు రీలాక్స్ గా ఉంచుకునేందుకు సంగీతం వినడం, ఇంకా సినిమాలు చూడటం వంటివి చూడటం మంచిది.మధుమేహం సమస్యతో బాధపడేవారు తప్పనిసరిగా తీసుకునే ఆహారంలో సమతుల్యతని పాటించాలి. ఎప్పుడు పడితే అప్పుడు ఏ ఆహారం పడితే ఆ ఆహారం అస్సలు తీసుకోకూడదు. కొవ్వు పదార్థాలు లేని ఆహార పదార్థాలను వారు తీసుకోవాలి. ఇంకా అలాగే రక్తంలో షుగర్ స్థాయిని పెంచే పదార్థాలు అస్సలు తినకూడదు.ఇంకా అలాగే రోజులో నాలుగు చపాతీలు ఒకేపూట తీసుకుంటే.. పూటకు రెండు చొప్పున ఒక రోజులో రెండు సార్లు వాటిని తీసుకోవాలి.షుగర్ ఉన్న వారు ఆహారంగా తృణధాన్యాలను ఎక్కువుగా తీసుకోవడం చాలా మంచిది.కూరగాయలు ఇంకా బీన్స్ వంటివి తినాలి.


పిజ్జా, బర్గర్లు, నూడిల్స్, పేస్ట్రీలు, చాలా ఎక్కువ కొవ్వు ఉండే జంక్ ఫుడ్ కు మధుమేహం వ్యాధి ఉన్నవాళ్లు దూరంగా ఉండాలి.స్కిన్ లెస్ చికెన్ ను భోజనంతో లిమిటెడ్ గా తీసుకొవచ్చు.డయాబెటిస్ ఉన్న వ్యక్తులకు ఆల్కహాల్ తీసుకునే అలవాటు ఉంటే తక్కువగా తాగాలి.ఇంకా అలాగే బరువు అధికంగా పెరగకుండా చూసుకోవడం ద్వారా షుగర్ వ్యాధిని ఈజీగా నియంత్రించవచ్చు. ప్రతి రోజు వ్యాయమం చేయడం ఇంకా సమతూకంలో ఆహారం తీసుకోవడం ద్వారా బరువు తగ్గే ప్రయత్నం చేయాలి. బరువు తగ్గడం కోసం ఎటవంటి ఆహారం తీసుకోకుండా ఉండటం ఖచ్చితంగా ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది.మధుమేహం జబ్బు ఉన్న వ్యక్తి ప్రతిరోజూ తన దినచర్యలో భాగంగా ఖచ్చితంగా శారీరక వ్యాయమం చేయాలి. కనీసం 40 నుంచి 45 నిమిషాల పాటు వ్యాయమం చేయడం అనేది రక్తంలో షుగర్ స్థాయిని నియంత్రిస్తుంది. వాకింగ్, సైక్లింగ్, రోలర్ బ్లేడింగ్, జాగింగ్, స్విమ్మింగ్ ఇంకా అలాగే స్కిప్పింగ్ లేదా క్రీడలు ఆడటం వంటి శారీరక వ్యాయమాలు చేస్తే మధుమేహం ఖచ్చితంగా కూడా నియంత్రణలో ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: