మలబద్ధకం సమస్య పోవాలంటే ఈ టీని తాగండి?

Purushottham Vinay
మలబద్ధకం అనేది బాగా పీడిస్తున్న అత్యంత సాధారణంగా వేధించే సమస్యల్లో ఒకటి. అయితే మలబద్ధకాన్ని చాలా మంది కూడా ఏముందిలే అంటూ చాలా తక్కువ అంచనా వేస్తుంటారు. లైట్ తీసుకుంటూ దాన్ని నిర్లక్ష్యం చేస్తుంటారు.అయితే మలబద్ధకం అనేది చిన్న సమస్యగా అనిపించినా కూడా దీన్ని మాత్రం నిర్లక్ష్యం చేస్తే ఖచ్చితంగా ఎన్నో రకాల అనారోగ్య సమస్యలను తెచ్చి పెడుతుంది. అందుకే వీలైనంత త్వరగా మలబద్దకాన్ని వదిలించుకోవాలని ఆరోగ్య నిపుణులు వెల్లడిస్తున్నారు.అయితే మలబద్ధకం సమస్య దూరం అవ్వాలంటే పెద్దగా మందులు వాడాల్సిన పని ఏమీ లేదు. చిన్న చిన్న ఇంటి టిప్స్ పాటిస్తే చాలా ఈజీగా దాని బారి నుంచి బయటపడొచ్చు. ముఖ్యంగా ఇప్పుడు చెప్పబోయే టీని కనుక మీరు ఉదయాన్నే ఖాళీ కడుపుతో తీసుకుంటే మలబద్ధకం సమస్య ఈజీగా దూరం అవ్వడం ఖాయం.


ముందుగా ఒక ఆరెంజ్ పండును తీసుకుని ఉప్పు నీటిలో దాన్ని బాగా శుభ్రంగా కడగాలి. ఆపై దాని తొక్కను సపరేట్ చేసుకొని పెట్టుకోవాలి. తరువాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని ఒకటిన్నర గ్లాస్ వాటర్ ని పోయాలి. నీళ్లు వేడి అవ్వగానే అందులో ఆరెంజ్ తొక్కలు, ఒక టేబుల్ స్పూన్ అల్లం తరుగు ఇంకా చిన్న దాల్చిన చెక్క, రెండు యాలకులు వేసి పది నుంచి పదిహేను నిమిషాల పాటు వేడి చేసి మరిగించాలి. ఆ తరువాత స్టవ్ ఆఫ్ చేసుకుని నీటిని స్ట్రైనర్ సహాయంతో ఫిల్టర్ చేసుకోవాలి.ఈ నీళ్లలో ఒక టేబుల్ స్పూన్ తేనె ను మిక్స్ చేస్తే ఈ టీ అనేది సిద్ధమవుతుంది. ఈ టీ ని ఉదయాన్నే మీరు ఖాళీ కడుపుతో తాగాలి. ప్రతిరోజు ఈ టీను తీసుకుంటే జీర్ణవ్యవస్థ పనితీరు చాలా బాగా మెరుగుపడుతుంది. దాంతో మలబద్ధకం మాత్రమే కాదు గ్యాస్, ఎసిడిటీ ఇంకా అలాగే కడుపు ఉబ్బరం వంటి ఇతర జీర్ణ సంబంధిత సమస్యలు కూడా చాలా ఈజీగా దూరం అవుతాయి. కాబట్టి మలబద్ధకం సమస్యతో తీవ్రంగా బాధ పడుతున్నవారు కచ్చితంగా ఈ టీ చేసుకొని తాగండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: