డయాబెటిస్ ను కంట్రోల్ చేసే అద్భుతమైన ఆహార పదార్థాలు..!

Divya
ఇటీవల కాలంలో వయస్సుతో సంబంధం లేకుండా చాలామంది డయాబెటిస్ తో బాధపడుతున్నారు. ఒకవేళ మీరు కూడా మధుమేహంతో బాధపడుతుంటే ఇకపై చింతించాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా చక్కెర వ్యాధిని సమూలంగా నిర్మూలించడానికి కొన్ని మార్గాలు అందుబాటులోకి రావడం గమనార్హం. నిజానికి డయాబెటిస్, బి పి తో పాటు మరి కొన్ని వ్యాధులను సమూలంగా నిర్మూలించడానికి కష్టమే అయినా రక్తంలో చక్కెర స్థాయిని మాత్రం తగ్గించవచ్చు. ఇకపోతే ఇప్పుడు చెప్పబోయే కొన్ని సహజ సిద్ధమైన ఆహార పదార్థాల ద్వారా డయాబెటిస్ ను కంట్రోల్ చేయవచ్చు అని వైద్యులు తెలియజేస్తున్నారు. ఆ తాజా ఆహార పదార్థాలు ఏమిటో ఒకసారి మనం చదువుకున్నాం.
నేరేడు పండ్లు:
ఇక డయాబెటిస్ వారికి చక్కటి ఆహారపు పండ్లు అని చెప్పవచ్చు. నేరేడు గింజల తో మరిన్ని ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా నేరేడు గింజలను ఎండబెట్టి.. పౌడర్ చేసి క్రమం తప్పకుండా ప్రతిరోజు ఉదయం గోరువెచ్చని నీటిలో కలుపుకొని పరగడుపున తాగితే మరిన్ని ఫలితాలు లభిస్తాయి. ఇకపోతే నేరేడు గింజల తో తయారుచేసిన పొడి ద్వారా మీరు టీ కాచుకుని తాగినా సరే ఫలితాలు రెట్టింపు స్థాయిలో ఉంటాయి.
మెంతులు:
మెంతులతో కూడా డయాబెటిస్ వ్యాధిగ్రస్తులకు చికిత్సను అందించవచ్చు. మధుమేహంను నియంత్రణలో ఉంచడానికి మెంతులు అనేవి చాలా చక్కగా పనిచేస్తాయి. ఇక ప్రతిరోజు రాత్రి మెంతుల్ని నీటిలో నానబెట్టాలి. ఉదయం పరగడుపున ఆ మెంతుల్ని మిక్సీ పట్టి అదే నీటిలో కలుపుకొని తాగడం వల్ల డయాబెటిస్ సమస్య అదుపులో ఉంటుంది.

అంజీర్ ఆకులు:
సాధారణంగా అంజీర్ పండ్ల తో కూడా డయాబెటిస్ ను అదుపులో చేయవచ్చు. కానీ పూర్తిగా తగ్గించుకోవాలి అంటే అంజీర్ ఆకులు ఒక మంచి మెడిసిన్ అని చెప్పవచ్చు. ప్రతి రోజూ ఉదయం పరగడుపున అంజీర ఆకులను నమిలి మింగడం వల్ల మరెన్నో లాభాలు ఉంటాయి. లేదంటే ఈ ఆకులను నీటిలో ఉడికించి ఆ నీటిని తాగినా కూడా మంచి ఫలితాలను పొందవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: