ఈ డ్రింక్ తాగితే ఎంత పొట్టున్నా యిట్టె కరిగిపోతుంది ?

VAMSI
నేడు మీరు బాగా గమనిస్తే బయట తిండి అయినటువంటి ఆయిల్ ఫుడ్ మరియు ఇతర ఫుడ్ లను తిని అధిక బరువు బారిన పడుతున్నారు. అధిక బరువు వలన ఎన్ని ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది అన్నది తెలిసిందే. ఇలా ఇబ్బంది పడుతున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. వ్యాయామాలు, మందులు అంటూ ప్రజలు పరుగులు తీస్తున్నారు. అయితే బరువును తగ్గించుకోవడం కోసం మందులు వాడితే వాటి ప్రభావం కారణంగా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉందన్న విషయం తెలిసిందే. అందుకే బరువును తగ్గించుకోవడానికి క్రమం తప్పకుండా వ్యాయామం, కొన్ని నాచురల్ టిప్స్ ను పాటిస్తే ఆరోగ్యంగా బరువును తగ్గించుకోవచ్చు అంటున్నారు. కాగా బరువును తగ్గించుకోవడానికి ఒక వంటింటి చిట్కా మీ కోసం.
చియా సీడ్స్ మార్కెట్లో అందుబాటులో ఉంటాయి. కాగా ఒక గ్లాస్ లో ఒక టీ స్పూన్ చియా సీడ్స్ ను తీసుకుని అందులో ఒక స్పూన్ తేనె, అర చెక్క నిమ్మరసం ను వేసి గోరు వెచ్చని నీరు పోసి బాగా కలిపి ఒక పావు గంట సేపు అలా బాగా నాననివ్వాలి.  అప్పుడు చియా సీడ్స్ ఆ మిశ్రమంలో బాగా  ఉబ్బుతాయి. ఈ నీటిని ఉదయం లేవగానే పరగడుపున తాగడం వలన మంచి ఫలితాన్ని పొందవచ్చు. ఈ మిశ్రమము ప్రతి రోజు తాగుతూ ఉంటే శరీరంలో కొవ్వు కరగడంలో బాగా సహాయం చేస్తుంది. ఏ పనికైనా రెగ్యులారిటి అనేది ప్రదానం.  
చియా సీడ్స్ లో ఉన్న ఫైబర్ కొవ్వును కరిగించడానికి బాగా పనిచేస్తుంది. అంతే కాకుండా ఇది తాగితే కడుపు నిండిన భావన కలగడమే కాకుండా తక్షణ శక్తి లభిస్తుంది. అంతే కాకుండా చియా గింజల్లోని ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌లో.. ఆల్ఫా-లినోలెనిక్ ఆమ్లాలు ఉండుట చేత ఇవి  గుండె ను ఆరోగ్యంగా ఉండేలా సహాయపడతాయి.  జీర్ణక్రియను నియంత్రించడంలో కూడా ఇవి అద్భుతంగా పనిచేస్తాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: