కిడ్నీ స్టోన్స్ : ఈ మొక్క ఆకులతో మటుమాయం!

Purushottham Vinay
మన చుట్టూ పరిసరాల్లో ఎన్నో రకాల ఔషధ మొక్కలు ఉన్నాయి. ఇవి మన చుట్టూ ఎక్కువగా పెరుగుతూనే ఉంటాయి. కానీ వాటి గురించి మాత్రం మనకు తెలియదు.ఇక అలాంటి మొక్కల్లో నేల ఉసిరి మొక్క ఒకటి. ఈ మొక్క చాలా చిన్నగా ఉంటుంది. తక్కువ పొడవు కూడా పెరుగుతుంది.అలాగే దీని కొమ్మలకు కాయలు కాస్తాయి. దీన్ని చాలా సులభంగానే గుర్తు పట్టవచ్చు. అయితే ఈ నేల ఉసిరి మొక్క కిడ్నీలో రాళ్లు ఉన్నవారికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇక 2004లో సైంటిస్టులు చేసిన పలు పరిశోధనల ప్రకారం.. నేల ఉసిరి మొక్క ఆకులకు కిడ్నీ స్టోన్లను కరిగించే శక్తి ఉన్నట్లు తెలిసింది. అందువల్ల కిడ్నీ స్టోన్లు ఉన్నవారు ఈ మొక్క ఆకులను తీసుకుంటే సమస్య దూరం అవుతుంది. ఇక అందుకు దీన్ని ఎలా వాడాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం.నేల ఉసిరి మొక్క ఆకులను సేకరించి వాటిని బాగా శుభ్రంగా కడిగి పక్కన పెట్టాలి.అలాగే ఇప్పుడు రెండు కప్పుల నీళ్లను తీసుకోవాలి. అందులో ఒక రెబ్బ నేల ఉసిరి ఆకులను కూడా వేయాలి. తరువాత ఆ నీటిని బాగా మరిగించాలి.

నీళ్లు రెండు కప్పుల నుంచి ఒక కప్పు అయ్యే దాకా సన్నని మంటపై మరిగించాలి. తరువాత ఆ నీటిని వడకట్టి గోరు వెచ్చగా ఉన్నప్పుడే వాటిని తాగేయాలి.ఇక ఈ విధంగా నేల ఉసిరి ఆకులతో కషాయం తయారు చేసుకుని రోజూ రెండు పూటలా తాగాలి. ఉదయం, సాయంత్రం భోజనం తరువాత ఒక గంట విరామం ఇచ్చి ఈ కషాయాన్ని తాగుతుండాలి. దీన్ని నెల రోజుల పాటు తాగితే తప్పక మంచి ఫలితం కనిపిస్తుంది. కిడ్నీల్లోని రాళ్లు కూడా కరిగిపోతాయి. అవి మళ్లీ రాకుండా ఉంటాయి. ఇక ఈ ఆకుల కషాయం మన శరీర రోగ నిరోధక శక్తిని బాగా పెంచుతుంది. కీళ్ల నొప్పులను కూడా తగ్గిస్తుంది. ఇంకా ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలను కూడా ఈ కషాయం అందిస్తుంది. కాబట్టి దీన్ని ఎక్కడ దొరికినా సరే ఇంటికి తెచ్చుకుని ఇంట్లో పెంచుకునే ప్రయత్నం చేయండి. ఎన్నో విధాలుగా లాభాలను పొందవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: