మామిడి పండ్ల రంగు చూసి మోసపోతున్నారా.. ప్రాణాలే పోతాయి జాగ్రత్త !
చాలా చోట్ల ఇదే పద్ధతిని పాటిస్తూ అధిక ఆదాయాలను పొందుతున్నారు. అయితే కొనుగోలు దారులు సైతం తళతళలాడుతున్న మామిడి కాయలను చూసి అట్రాక్ట్ అయి అధిక ధరలు చెల్లించి మరీ కొనుగోలు చేస్తున్నారు.
మామిడి కాయలను మాగబెట్టేందుకు సంప్రదాయ విధానమే ఉత్తమం. అంతే కాకుండా కొన్ని నూతన విధానాలు కూడా ఉన్నాయి. కానీ ఇలా పలు రకాల రసాయనాలను వినియోగించి మగ్గించడం వలన ఇవి తిన్న వారి ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంది. దీని వలన అవయవాలపై తీవ్ర ప్రభావం పడి తీవ్ర అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని ఉద్యానవన అధికారులు చెబుతున్నారు.
మామిడి కాయలను మాగబెట్టేందుకు వ్యాపారులు, రైతులు కాల్షియం కార్బైడ్ వాడినట్లయితే దాని నుంచి వెలువడే ఎసిటిలిన్ వాయువులో పాస్సిన్, అర్సిన్ అనే వాయువులు కలిగి ఉండటం వల్ల ఆ పండ్లను తిన్న వారికి క్యాన్సర్ సోకే ప్రమాదం కూడా ఉందని చెబుతున్నారు. ఈ క్రమంలో ఇటువంటి రసాయనాలు వినియోగిస్తూ ప్రజల ప్రాణాలను పనంగా పెడుతున్న వ్యాపారస్తులు, రైతులను గుర్తించి వారికి శిక్షలు విధించాలని ఉద్యానవన అధికారులు చర్యలు మొదలుపెట్టారు.