క్యాన్సర్ ని దూరం చేసే ఈ పండు గురించి తెలిస్తే..?
ముఖ్యంగా యాంటీ మలేరియా లక్షణాలు కూడా బొప్పాయిలో ఉంటాయి కాబట్టి డెంగ్యూ, మలేరియా వంటి సమస్యలు వచ్చినప్పుడు బొప్పాయి చాలా బాగా హెల్ప్ చేస్తుందని ఆయుర్వేద స్పెషలిస్ట్ తెలుపుతున్నారు.. బొప్పాయి ఆకులు అలాగే బొప్పాయి పండు తీసుకోవడం వల్ల వెంటనే ఈ లక్షణాలను మనం తగ్గించుకోవచ్చని ప్లేట్లెట్ కౌంట్ కూడా పెరుగుతుందని చెబుతున్నారు.
ఇక అదే విధంగా బాగా పండిన బొప్పాయి పండును జ్యూస్ రూపంలో చేసుకుని కొద్దిగా నిమ్మరసం కలుపుకుని తాగడం వల్ల మరిన్ని ప్రయోజనాలు కలుగుతాయి.. నిమ్మరసం వేయడం వల్ల రుచితో పాటు విటమిన్ సి కూడా లభిస్తుంది కాబట్టి రోజుకు రెండు సార్లు ఈ రసాన్ని తాగినట్లయితే డెంగ్యూ నుంచి బయటపడవచ్చు. మరెన్నో సమస్యల నుంచి బయటపడేయడానికి మనకు చాలా బాగా పనిచేస్తాయి. బొప్పాయి లో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి కాబట్టి తిన్నా కూడా బరువు పెరగరు..ముఖ్యంగా రక్తంలో ఎర్రరక్తకణాల సంఖ్య అభివృద్ధి చేసి క్యాన్సర్ తో పోరాడే గుణాలు కూడా ఈ బొప్పాయి కలిగి ఉంటుంది. కోలన్ క్యాన్సర్ , గర్భాశయ కాన్సర్ వంటివి దూరం చేయడానికి బొప్పాయి చాలా బాగా పనిచేస్తుంది.