క్యాన్సర్ ని దూరం చేసే ఈ పండు గురించి తెలిస్తే..?

Divya
ప్రస్తుతం మారుతున్న జీవన శైలి.. వాతావరణంలో కలిగే మార్పులు.. మనం తీసుకునే ఆహారంలో పోషకాల లోపం ఇలా ఎన్నో కారణాల వల్ల అనారోగ్య సమస్యలు చుట్టుముడుతున్నాయి అని చెప్పవచ్చు.. ఇటీవల కాలంలో చాలామంది అనారోగ్యాల బారిన పడుతూ విపరీతంగా ఎన్నో సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు.. కరోనా వచ్చిన తర్వాత చాలా మంది ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఏదో ఒక కారణంగా పోషక పదార్థాలు అందక తరచూ వ్యాధుల బారిన పడుతున్నారు..

తాజా అధ్యయనాలు ఏం చెబుతున్నాయంటే పోషక పదార్థాలు అధికంగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని సమాచారం.. ముఖ్యంగా మన శరీరంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి బొప్పాయి పండు చాలా బాగా పనిచేస్తుందని వైద్యులు సలహా ఇస్తున్నారు.. ఇక బొప్పాయి అలాగే దాని వల్ల కలిగే లాభాల గురించి కూడా ఆరోగ్య నిపుణులు మనకు ఏం చెబుతున్నారు అనే విషయాన్ని కూడా మనం ఆలస్యం చేయకుండా త్వరగా తెలుసుకుందాం..

ముఖ్యంగా యాంటీ మలేరియా లక్షణాలు కూడా బొప్పాయిలో ఉంటాయి కాబట్టి డెంగ్యూ, మలేరియా వంటి సమస్యలు వచ్చినప్పుడు బొప్పాయి చాలా బాగా హెల్ప్ చేస్తుందని ఆయుర్వేద స్పెషలిస్ట్ తెలుపుతున్నారు.. బొప్పాయి ఆకులు అలాగే బొప్పాయి పండు తీసుకోవడం వల్ల వెంటనే ఈ లక్షణాలను మనం తగ్గించుకోవచ్చని ప్లేట్లెట్ కౌంట్ కూడా పెరుగుతుందని చెబుతున్నారు.

ఇక అదే విధంగా బాగా పండిన బొప్పాయి పండును జ్యూస్ రూపంలో చేసుకుని కొద్దిగా నిమ్మరసం కలుపుకుని తాగడం వల్ల మరిన్ని ప్రయోజనాలు కలుగుతాయి.. నిమ్మరసం  వేయడం వల్ల రుచితో పాటు విటమిన్ సి కూడా లభిస్తుంది కాబట్టి రోజుకు రెండు సార్లు ఈ రసాన్ని తాగినట్లయితే డెంగ్యూ నుంచి బయటపడవచ్చు. మరెన్నో సమస్యల నుంచి బయటపడేయడానికి మనకు చాలా బాగా పనిచేస్తాయి. బొప్పాయి లో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి కాబట్టి తిన్నా కూడా బరువు పెరగరు..ముఖ్యంగా రక్తంలో ఎర్రరక్తకణాల సంఖ్య అభివృద్ధి చేసి క్యాన్సర్ తో పోరాడే గుణాలు కూడా ఈ బొప్పాయి కలిగి ఉంటుంది. కోలన్ క్యాన్సర్ , గర్భాశయ కాన్సర్ వంటివి దూరం చేయడానికి బొప్పాయి చాలా బాగా పనిచేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: