ఓఆర్ఎస్ ద్రావణం సేవించడం వల్ల కరోనా నుంచి త్వరగా కోలుకోవచ్చా ?

Divya

కరోనా బారిన పడిన వారు అందరూ హాస్పిటల్లో చేరాల్సిన అవసరం ఉండదు. కేవలం కొందరికి మాత్రమే హాస్పిటల్లో చికిత్స అందించాల్సి ఉంటుంది. అయితే కోవిడ్ పేషెంట్ లు ఎక్కువగా ద్రవాలను కోల్పోతారు. కనుక వారు ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ (ఓ ఆర్ ఎస్) ద్రావణం తాగితే శరీరంలో ద్రవాలు తిరిగి చేరడం తో పాటు కోవిడ్ నుంచి త్వరగా కోలుకునేందుకు అవకాశం ఉంటుందని కొంతమంది నిపుణులు సూచిస్తున్నారు. అది ఎలాగో చూద్దాం.
కోవిడ్ సోకినవారిలో డయేరియా, జ్వరం, వాంతులు వంటి లక్షణాలు కనిపిస్తాయి. దగ్గు కూడా వస్తుంది. దీంతో శరీరంలోని ద్రవాలు, ఎలక్ట్రో లైట్స్ ను త్వరగా కోల్పోతాయి.
అలా కోల్పోయినప్పుడు డీహైడ్రేషన్ బారిన పడతారు. అయితే అలా జరగకుండాఉండాలంటే ఓఆర్ఎస్ ద్రావణం తాగాలని నిపుణులు సూచిస్తున్నారు. దీంతో శరీరం కోల్పోయిన ద్రవాలు,ఎలక్ట్రోలైట్స్ తిరిగి అందుతాయి. తద్వారా కోవిడ్ పై పోరాడేందుకు శరీరానికి కావాల్సిన శక్తి, పోషకాలు కూడా లభిస్తాయి. తద్వారా త్వరగా కోలుకునేందుకు అవకాశం ఉంటుంది. అందువల్ల ఓఆర్ఎస్ ద్రావణం తాగాలని చెబుతున్నారు.
ఈ ఓఆర్ఎస్ ద్రావణం ప్యాకెట్లు ఎక్కడైనా మెడికల్ స్టోర్ లో పౌడర్ రూపంలో లభిస్తాయి. వాటిని కొనుగోలు చేసేందుకు వైద్యుల సహాయం అవసరం లేదు. అందువల్ల ఆ ప్యాకెట్ లను  ఎవరైనా తీసుకోవచ్చు. ఇక ఓఆర్ఎస్ ప్యాకెట్లలో  ఉండే పొడిని, వాటికి సూచించిన విధంగా నీటిలో కలుపుకుని తాగాలి. గంటకు ఒకసారి 120 ml మోతాదు లో ఓ ఆర్ ఎస్ ద్రావణం తాగాలి. అలాగే విసర్జన 3-4 గంటలకు ఒకసారి మాత్రమే చేయాలి. దీంతో త్వరగా ద్రవాలు, ఎలక్ట్రోలైట్స్ లభిస్తాయి. అయితే ఇంట్లోనే ఓఆర్ఎస్ ద్రావణం ని తయారు చేసుకోవచ్చు.
ఒక లీటర్ నీటిని తీసుకుని మరిగించి చల్లార్చాలి. అందులో అర టీ స్పూన్ ఉప్పు, 5-6 టీ స్పూను చక్కెర కలపాలి. ఇలా మొత్తాన్ని మిశ్రమం చేయడం ద్వారా ఓఆర్ఎస్ ద్రావణం తయారవుతుంది. దీన్ని కూడా తాగవచ్చు.  దీంతో  కోవిడ్ వల్ల వచ్చే  డీహైడ్రేషన్ సమస్య తగ్గుతుంది. కోవిడ్ నుంచి త్వరగా కోలుకుంటారు. కాబట్టి ప్రతి ఒక్కరూ తాగవచ్చు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: