శరీర రోగ నిరోధక శక్తిని పెంచే చిట్కాలు ?

sangeetha
 గత సంవత్సరం కరోనా వల్ల సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరూ ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నారు. అయితే కరోనా వల్ల గత సంవత్సరం లాక్ డౌన్ విధించిన సంగతి మనందరికీ తెలిసిందే. అదే సమయంలో కేసుల సంఖ్య పెద్దగా లేదు. అయితే లాక్ డౌన్ ఆంక్షలను తరలించగా ఒక్కసారిగా భారీ గా కేసులు నమోదయ్యాయి. ఇలా దీనివల్ల ఇంత మంది ప్రాణాలను కోల్పోయారు. అయితే తర్వాత అక్టోబర్ సమయంలో కేసుల సంఖ్య బాగా తగ్గింది. దీనితో ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న సమయంలో కరోనా సెకండ్ వేవ్ అంటూ మళ్ళీ మొదలైంది . రోజురోజుకీ ఉగ్రరూపం దాలుస్తోంది. రోజులో ఊహించిన దానికంటే ఎక్కువగానే కేసులు నమోదు అవుతున్నాయి. గత ఏడాది కన్నా వేగంగా కోవిడ్ వ్యాపిస్తోంది. దీనితో ఆరోగ్యంపై శ్రద్ధ మరింత పెరిగింది. అయితే కరోనా వైరస్ లాంటివి సోకకుండా ఉండాలి అంటే రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవడం ఎంతో అవసరం అయితే రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి ఇటువంటి చిట్కాలు పాటించాలి ఇప్పుడు తెలుసుకుందాం..

 రోజు మనం తినే డైట్ లో రోగనిరోధక శక్తి పెంచే ఆహార పదార్థాలు అనగా యాంటీఆక్సిడెంట్లు ముఖ్యంగా విటమిన్ సి అధికంగా ఉండే ఆహారాలను తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తిని పెంచుకోవచ్చు. దానిమ్మ,జామ నిమ్మ,బెర్రీలు బాదంపప్పు, ఇత్తనాలు క్యారెట్లు చిలగడదుంపలు వంటి ఆహారాలను తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తిని పెంచుకోవచ్చు. పసుపు,అల్లం,నల్ల మిరియాలు, లవంగాలు,దాల్చిన చెక్క, యాలకులు,సోంపు తులసి తిప్పతీగ వంటి మసాలా దినుసులు ఎక్కువగా ఆహారంలో చేర్చుకోవాలి. వీటివల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది వ్యాధులు ఇన్ఫెక్షన్లు రాకుండా ఉంటాయి.

 అలాగే సరిగా నిద్ర పోకపోతే అది రోగనిరోధక శక్తిపై ప్రభావాన్ని చూపిస్తుంది. దీనితో రోగనిరోధక శక్తి తగ్గుతుంది. కనుక రోగనిరోధక శక్తిని పెరగాలంటే  రోజుకు  కనీసం ఆరు నుంచి ఎనిమిది గంటల పాటు అయినా సరే నిద్రించాలి. ఎవరు ఎన్ని గంటలు నిద్ర పోవాలి అనేది కూడా వారి శరీర తత్వాన్ని బట్టి ఉంటుంది. కనుక సౌకర్యానికి తగినట్లుగా వారు తగినన్ని గంటల పాటు రోజు నిద్రించాలి .దీనితో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.

 ఉదయాన్నే రోజు సూర్య రష్మీ  లో కొంత సేపు గడపాలి. దీనివల్ల విటమిన్-డి తయారవుతుంది. ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. పాలు పుట్టగొడుగులు తదితర ఆహారాలను తీసుకోవడం వల్ల కూడా విటమిన్ డి లభిస్తుంది. రోజూ కొంతసేపు ప్రకృతిలో సహజ సిద్ధమైన గాలిలో తిరగాలి. ఇవాళ ఊపిరితిత్తుల సామర్థ్యం పెరుగుతుంది. ఊపిరితిత్తులు ఆరోగ్యంగా మారతాయి. సూక్ష్మక్రిముల పై  పోరాడగలిగే శక్తి ఊపిరితిత్తులకు లభిస్తుంది. ఇన్ఫెక్షన్లు రాకుండా ఉంటాయి. అలాగే వీలైనంత వరకు తేలికగా జీర్ణమయ్యే ఆహార పదార్థాలను తీసుకోవాలి. ఆహారం జీర్ణం కాని పక్షంలో ఆ పూటకు కూరగాయల సూప్ కొబ్బరినీళ్లు, కీరదోస  ముక్కలు తీసుకోవాలి. తర్వాత ఆకలివేస్తే తెనాలి. ఇలా ఆహార విషయంలో జాగ్రత్తలు పాటించాలి.

 అలాగే రాత్రి పది గంటల తరువాత ఎట్టిపరిస్థితుల్లోనూ ఆహారం తీసుకోకూడదు. దీని వల్ల కాలేయం పై అదనపు భారం పడుతుంది. అలాగే రాత్రి భోజనానికి నిద్రకు కనీసం మూడు గంటల వ్యవధి ఉండేలా చూసుకోవాలి. దీని వలన జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచేందుకు సహాయపడుతుంది.  వీలైనంత వరకు తాజాగా పండ్లు, కాయగూరలు, తృణ ధాన్యాలు, బీన్స్, చిక్కుడు జాతి కూరగాయలు పాల ఉత్పత్తులను తీసుకోవడం ద్వారా రోగ నిరోధక శక్తిని పెంచుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: