కిడ్నీలో రాళ్లు ఉన్నవాళ్లు ఈ ఆహార పదర్ధాలకు దూరంగా ఉండాలి
బచ్చలి కూరలో ఉండే ఆక్సలేట్ రక్తంలోని కాల్షియంతో కలిసిపోవడం వల్ల కిడ్నీల్లో రాళ్లు ఏర్పడే అవకాశం ఉంటుంది. అలాగే ఆక్సలేట్ కంటెంట్ ఎక్కువగా ఉండే బీట్ రూట్, ఓక్రా, బెర్రీస్, కంద దుంప, టీ, చాక్లెట్ కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకోకూడదు. సాధ్యమైనంత వరకు టీ, కాఫీలకు దూరంగా ఉంటే మంచిది. ప్రోటీన్ అధికంగా ఉండే రెడ్ మీట్, పాలు, పాల ఉత్పత్తులు , చేపలు , గుడ్లు కూడా ఎక్కువగా తీసుకున్నా కిడ్నీల్లో రాళ్లు ఏర్పడే అవకాశం ఉంటుంది.
సోడియం అధికంగా తీసుకోవడం వల్ల కూడా కిడ్నీల్లో రాళ్లు ఏర్పడే అవకాశం ఉంటుంది. నిల్వ ఉండే ఆహారం , ఉప్పు ఉన్న చిప్స్ ను తక్కువగా తీసుకుంటే చాాలా మంచిది. కూల్ డ్రింక్స్ లో ఉండే పాస్పేట్ కూడా కిడ్నీల్లో రాళ్లకు కారణమవుతుంది.అందుకనే కూల్ డ్రింక్స్ కి కూడా దూరంగా ఉంటే చాలా మంచిది. విల్లయినన్ని మంచి నీళ్లు తాగాలి. కొబ్బరి నీళ్లు తాగడం కూడా చాలా మంచిది.. !