కిడ్నీలో రాళ్లు ఉన్నవాళ్లు ఈ ఆహార పదర్ధాలకు దూరంగా ఉండాలి

Suma Kallamadi
ఈ మధ్య కాలంలో చాలా మంది వయసుతో  సంబంధం లేకుండా కిడ్నీలో రాళ్ల  సమస్యతో బాధ పడుతున్నారు . ఈ సమస్య బారిన పడితే నొప్పి తీవ్రంగా ఉంటుంది. కిడ్నీలో రాళ్ల సమస్యకు మందులు వాడి చెక్ పెట్టవచ్చు. అయితే సమస్య తీవ్రంగా ఉంటే మాత్రం ఆపరేషన్ చేసి కిడ్నీలో రాళ్లను తొలగించాల్సి ఉంటుంది.కొంత మందికి ఈ సమస్య తగ్గినట్టే తగ్గి మళ్లీ వేధిస్తూ ఉంటుంది.ఒక్కోసారి నొప్పి కూడా అధికంగా ఉంటుంది.  కిడ్నీ స్టోన్స్ బారిన పడినా, ఆ సమస్య పునరావృతం కాకూడదన్నా ఆహారపు అలవాట్లలో కొన్ని మార్పులు చేర్పులు చేసుకోవాలి.కిడ్నీ స్టోన్స్ తో బాధ పడుతున్నా వారు  కొన్ని ఆహారాల జోలికి అస్సలు వెళ్లకూడదు. కిడ్నీ స్టోన్స్ తో బాధ పడేవాళ్లు బచ్చలి కూర తీసుకోకూడదు.

బచ్చలి కూరలో ఉండే ఆక్సలేట్ రక్తంలోని కాల్షియంతో కలిసిపోవడం వల్ల కిడ్నీల్లో రాళ్లు ఏర్పడే అవకాశం ఉంటుంది. అలాగే ఆక్సలేట్ కంటెంట్ ఎక్కువగా ఉండే బీట్‌ రూట్, ఓక్రా, బెర్రీస్, కంద దుంప, టీ, చాక్లెట్ కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకోకూడదు. సాధ్యమైనంత వరకు టీ, కాఫీలకు దూరంగా ఉంటే మంచిది. ప్రోటీన్ అధికంగా ఉండే రెడ్ మీట్, పాలు, పాల ఉత్పత్తులు , చేపలు , గుడ్లు కూడా ఎక్కువగా తీసుకున్నా కిడ్నీల్లో రాళ్లు ఏర్పడే అవకాశం ఉంటుంది.

సోడియం అధికంగా తీసుకోవడం వల్ల కూడా కిడ్నీల్లో రాళ్లు ఏర్పడే అవకాశం ఉంటుంది. నిల్వ ఉండే ఆహారం , ఉప్పు ఉన్న చిప్స్ ను తక్కువగా తీసుకుంటే చాాలా మంచిది. కూల్ డ్రింక్స్ లో ఉండే పాస్పేట్ కూడా కిడ్నీల్లో రాళ్లకు కారణమవుతుంది.అందుకనే కూల్ డ్రింక్స్ కి కూడా దూరంగా ఉంటే చాలా మంచిది. విల్లయినన్ని మంచి నీళ్లు తాగాలి. కొబ్బరి నీళ్లు తాగడం కూడా చాలా మంచిది.. !

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: