పప్పు ధాన్యాల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు..?

sravani
 ఆరోగ్యంగా ఉంటేనే మనిషి ఏమైనా చేయగలడు. ఆరోగ్యం గా లేక పోతే ఏది సాధ్యంకాదు. దీనికి బలవర్ధకమైన ఆహారాన్ని తీసు కోవాలి. అయితే రోజు ఒకే రకమైన ఆహారం తీసుకోవడం, ప్రతి రోజు ఉదయం లేచినప్పటినుంచి పడుకో బోయే వరకు తీసుకునే ఆహారం ఒకే రకంగా ఉం టే మనిషిలో ఎదుగు బొదుగు లేకుండా ఉంటా రని వైద్య శాస్త్ర పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. మనం తీసుకునే ఆహార పదార్థాల వినియోగంలో ఎప్పటికప్పుడు మార్పులు తీసుకుంటే ఆరోగ్యం సలక్షణంగా ఉంటుంది.ప్రతిరోజూ మనం తీసుకునే ఆహారంలో పప్పు ధాన్యాలకు మంచి ప్రాధాన్యత ఉంది. భారత్‌లో పప్పుధాన్యాలు లేని ఇల్లు ఉండదంటే అతిశయోక్తి కాదు. కంది, పెసర, మినుము, శనగ, అలసందలు వంటి పప్పు ధాన్యాలలో ఎన్నో పోషకాలు ఉంటాయి.

 ఇవి రోజూవారీ ఆహారంలో ముఖ్య భాగం అయినప్పటికీ ఇవి గ్యాస్, మలబద్ధకం వంటి కొన్ని జీర్ణ సమస్యలకు కారణమవుతాయి. అందుకని పప్పుధాన్యాలకు దూరంగా ఉండలేం.అన్నిరకాల పప్పుధాన్యాలు, మొలకలను వండే సమయంలో ముందుగా నానబెట్టాలి.పప్పుధాన్యాలు, గింజలు కలిపి వాడేటట్లయితే 1:3 పద్ధతిలో ఉపయోగించాలి. పప్పుధాన్యాలు, చిరుధాన్యాలు కలిపి వాడేటట్లయితే 1:2 పద్ధతిలో ఉపయోగించాలి.ప్రతి వారం కనీసం ఐదురకాల పప్పుధాన్యాలను ప్రతి నెల వివిధ రూపాల్లో వండుకుని తినడం ఆరోగ్యానికి మంచిది.పప్పుల్లో ఇది బాగా ప్రసిద్ధి చెందింది. భారత్‌లో వీటిని ఎక్కువగా తింటారు. కందిపప్పులో ప్రొటీన్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇందులో కొలెస్టరాల్, సాచ్యురేటెడ్ ఫ్యాట్ చాలా తక్కువగా ఉంటాయి.

కందిపప్పు కొంచెం తినగానే కడుపు నిండిన భావన ఉంటుంది. అంతేకాకుండా ఇది తింటే తొందరగా మళ్లీ ఆకలి కూడా వేయదు. కందిపప్పుకు ఉన్న రుచి మరే ఇతర పప్పుకు ఉండదు పెసరపప్పును డైటర్స్ ఫ్రెండ్లీ దాల్ అంటారు. ఎందుకంటే ఈ పప్పులో ప్రొటీన్లు, క్యాలరీలు ఉంటాయి. అంతేకాకుండా ఐరన్, పొటాషియం కూడా ఎక్కువ. ఇవి రెండూ కూడా ఆరోగ్యానికి అత్యధిక ప్రయోజనాలను అందిస్తాయి.మన భారత్‌లో వెజిటేరియన్ ఆహారంతో పాటు నాన్ వెజ్ తినే వారు కూడా వారి రెగ్యులర్ డైట్‌లో పప్పుధాన్యాలను చేర్చుకుంటారు. అందుకే మన భారతీయుల ఇళ్లల్లో వివిధ రకాల పప్పుధాన్యాలను స్టాక్ ఉంచుకుని ప్రతిరోజు ఓ డిఫరెంట్ ఐటమ్‌ను వండుకుని తింటుంటారు.

ఈ పప్పు ధాన్యాల వల్ల హెల్త్ బెనిఫిట్స్ అటుంచితే ఒక్కో పప్పుధాన్యంలో ప్రత్యేకమైన పోషక విలువలు కలిగి ఉంటాయి. కాబట్టి, మీ రెగ్యులర్ డైట్‌లో ఈ పప్పు ధాన్యాల మిశ్రమాన్ని తప్పకుండా చేర్చుకోవాలి. ఇతర ధాన్యాలతో పోలిస్తే పప్పుధాన్యాలు ఆరోగ్యానికి మంచిది.ఇది వెన్నుపూసకు ఎంతో బలాన్నిస్తుంది. అంతేకాదు మినుముల్లో ఉండే విటమిన్లు, ప్రోటీన్స్ శరీరానికి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాయి. ఎముకల బలానికి ఇవి ఉపయోగపడతాయి. అందుకే వారానికి రెండుసార్లు వంటల్లో మినపప్పును చేర్చుకోవాలని వైద్యులు సూచిస్తుంటారు. ఉలవల్లో కాల్షియం దండిగా ఉంటుంది. వీటిలో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు కూడా ఎక్కువగానే ఉంటాయి. ఇవి క్యాన్సర్ నివారణకు తోడ్పడతాయి. అంతేకాకుండా కొలెస్టరాల్, కడుపు ఉబ్బరం తగ్గడానికి కూడా ఉలవలు ఉపయోగపడతాయి. పప్పుధాన్యాలు యాంటీ ఏజింగ్‌గా పనిచేస్తాయి. ప్రిమెచ్యుర్ గ్రోయింగ్‌ను ఇవి నిరోధిస్తాయి. ఇవి శరీరానికి అధిక శక్తి ఇస్తాయి.పప్పు ధాన్యాల్లో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా లభిస్తాయి.పప్పుధాన్యాల్లో ఉండే అన్‌సాచురేటెడ్ కొవ్వులు చెడు కొలెస్టరాల్‌ను తగ్గిస్తాయి.జీర్ణక్రియను పప్పుధాన్యాలు మెరుగుపరుస్తాయి. మధుమేహం బారిన పడకుండా ఇవి కాపాడతాయి.శరీరంలోని ఎముకలను ఇవి బలోపేతం చేస్తాయిశరీరంలో పప్పుధాన్యాలు రోగనిరోధక శక్తి పెంచుతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: