పరుగులు పెడుతున్న పుత్తడి.. పడిపోయిన వెండి..!!
ఇకపోతే హైదరాబాద్ మార్కెట్లో శనివారం బంగారం ధర పెరిగింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.150 పైకి కదిలింది. రూ.48,710కు చేరింది. అదేసమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో నడిచింది. రూ.150 పెరుగుదలతో రూ.44,650కు చేరింది. ఇక వెండి ధరలు మాత్రం ఒక్కసారిగా కిందకు దిగివచ్చాయి..
ఈరోజు వెండి ధరల విషయానికొస్తె..వెండి ధర దిగొచ్చింది. రూ.700 పడిపోయింది. దీంతో కేజీ వెండి ధర రూ.75,300కు క్షీణించింది.అంతర్జాతీయ మార్కెట్లో కూడా బంగారం ధర పైకి ఎగసింది. బంగారం ధర ఔన్స్కు 1.09 శాతం పెరిగింది. దీంతో పసిడి రేటు ఔన్స్కు 1843 డాలర్లకు చేరింది. అంతర్జాతీయ మార్కెట్లో మాత్రం వెండి ధర పెరిగింది. పైపైకి కదిలింది. వెండి ధర ఔన్స్కు 1.67 శాతం పెరుగుదలతో 27.51 డాలర్లకు చేరింది.. కాగా బంగారం ధరపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు, బాండ్ ఈల్డ్ వంటి పలు అంశాలు పసిడి రేటుపై ప్రభావం చూపిస్తున్నాయి.. మరి రేపు మార్కెట్ లో బంగారం ధరలు ఎలా ఉంటాయో చూడాలి..