పసిడి ప్రియులకు శుభవార్త.. దిగొచ్చిన ధరలు..!!

Satvika
పసిడి ప్రియులకు చక్కటి శుభవార్త.. గత రెండు ,మూడు రోజుల నుంచి పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు ఈరోజు స్వల్పంగా కిందకు దిగాయి. కనుమ పండుగ రోజు ఆభరణాలు కొనుగోలు చేసే వారికి ఈ వార్త ఉపశమనం కలిగిస్తుంది.పండగ సందర్భంగా ఆడవాళ్ళు బంగారు దుకాణాల వద్ద బారులు తీరారు. శుక్రవారం మార్కెట్లు తగ్గుదలతొ ప్రారంభం అవుతున్నాయి. బంగారం ధరలు గురువారం ప్రారంభ ధరలతొ పోలిస్తే కొద్దిగా తగ్గాయి.



వెండి ధరలు కూడా బంగారం ధరలతో పాటుగా నడిచాయి.హైదరాబాద్ లో బంగారం ధరలు కిందికి దిగివచ్చాయి. శుక్రవారం బంగారం ధరలు గురువారం ప్రారంభ ధరల కంటె కొద్దిగా తగ్గాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం 450 రూపాయల తగ్గుదల నమోదు చేసింది. దీంతో 45,750 రూపాయలుగా నమోదు అయింది. ఇకపోతే 24 క్యారెట్ల బంగారం కూడా 49 వేలరూపాయల మార్క్ వద్దకు దిగొచ్చింది. పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం 500 రూపాయల తగ్గుదల నమోదు చేసి 49,900 రూపాయలుగా నమోదైంది.



బంగారం ధరలు పడిపోతే.. వెండి ధరలు కూడా తగ్గుతున్నాయి.కేజీ వెండి ధర గురువారం నాటి ప్రారంభ ధరకంటె 400 రూపాయలు పెరిగింది. దీంతో 70 వేల రూపాయల స్థాయికి వెండి ధరలు పెరిగాయి. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో చోటు చేసుకునే మార్పులు.. దేశీయంగా బంగారానికి డిమాండ్.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చును.. విశాఖపట్టణం, విజయవాడ, ఢిల్లీ లలో కూడా బంగారం ధరలు భారీగా తగ్గాయి. అంతర్జాతీయ మార్కెట్‌లోనూ బంగారం ధర పెరిగింది. బంగారం ధర ఔన్స్‌కు 0.95 శాతం పెరుగుదలతో 1873 డాలర్లకు చేరింది. బంగారం ధర పెరిగితే వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. ఔన్స్‌కు 1.18 శాతం పెరుగుదలతో 26.63 డాలర్లకు చేరింది.. మొత్తానికి రేట్లు ఓ మాదిరిగా తగ్గడంతో బంగారం కొనుగోలు పెరిగాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: