పసిడి డౌన్.. వెండి అప్.. నేటి మార్కెట్ ధరలు ఇలా...!

Suma Kallamadi
బంగారం ధర దిగివచ్చింది. పసిడి ధరలు రోజురోజకి పైకి పెరుగుతున్న సమయంలో నేడు కొంత ఉరటనిస్తూ.. నేడు భారీగా దిగొచ్చింది. పసిడి ధర పడిపోతే వెండి ధర మాత్రం పైకి ఎగిసింది. ఇటు దేశీయ మార్కెట్లో ఇలా ఉంటే, మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో మాత్రం పసిడి, వెండి ధరలు రెండూ తగ్గుముఖం పట్టాయి.  బంగారం ధర దిగి రావడంతో పసిడి వెలవెలబోయింది. నేడు బంగారం ధర భారీగా పడిపోవటం చేత  పసిడి కొనుగోలు చెయ్యాలి అనుకునే వారికి కొంత ఊరట కలిగించిందని చెప్పచు. ఇటు బంగారం ధర దిగి వస్తే .. వెండి ధర మాత్రం పైకి కదిలింది. గ్లోబల్ మార్కెట్‌లో పసిడి ధర భారీగా పడిపోవటంతో  దేశీ మార్కెట్‌లోనూ ఇదే హవా నడిచినట్టు  బులియన్ మార్కెట్ నిపుణులు చెప్తున్నారు.
హైదరాబాద్ మార్కెట్‌లో సోమవారం పసిడి ధర భారీగా పడిపోయింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ఏకంగా రూ.1,870 తగ్గటంతో  రూ.51,070కు క్షీణించింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం ధర కూడా 10 గ్రాములకు రూ.1,710 పతనమై  బంగారం ధర రూ.46,820కు తగ్గింది. ఇక్కడ పసిడి ధర పడిపోగా వెండి ధర మాత్రం పెరిగింది. కేజీ వెండి ధర రూ.100 పెరగటంతో  వెండి ధర రూ.61,700  అయింది. ఇందుకు  గల ప్రధాన కారణం పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ పుంజుకోవడం అని అంటున్నారు మార్కెట్ నిపుణులు.
పసిడి ధరపై ప్రభావం చూపే అంశాలు అనేకం ఉన్నాయి. ప్రధానంగా ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో పలు మార్పులు , కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, బ్యాంకుల వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి అనేక అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపిస్తాయి. జాతీయ మార్కెట్లో ఇలా ఉంటే మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో  కూడా బంగారం ధర దిగొచ్చింది. బంగారం ధర ఔన్స్‌కు 0.18 శాతం దిగిరావటంతో 1903 డాలర్లకు చేరింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: