SBI: విద్యార్థులకు సూపర్ గుడ్ న్యూస్?

Purushottham Vinay
ఇండియాలో టాప్ బ్యాంక్ గా దూసుకుపోతున్న ప్రభుత్వ బ్యాంకింగ్ దిగ్గజం  స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బిఐ) ఇప్పటికే చాలా పథకాలను అమలులోకి తీసుకువచ్చింది. ఈ పథకాల ద్వారా కస్టమర్లు చాలా రకాల ప్రయోజనాలు పొందుతున్నారు.ఇక ఇప్పటికే రైతులకు, వ్యాపారవేత్తలకు ఆర్థికంగా సహాయం చేసే వివిధ పథకాలను అమలులోకి తీసువచ్చి చాలా రకాలుగా సేవలు అందిస్తోంది. ఇంకా అలాగే ఇప్పుడు విద్యార్థులకు కూడా ఎస్బిఐ ఒక శుభవార్త తెలియజేసింది. పై చదువులు చదవాలనుకునే విద్యార్థుల్లకు ఎలాంటి చార్జీలు లేకుండా రు.20 లక్షల లోన్ ని sbi అందిస్తోంది. ఈ లోన్ ను తీసుకున్న వాళ్లు  మొత్తం 15 సంవత్సరాల లోపు లోన్ ను తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఎలాంటి ప్రాసెసింగ్ ఫీజు లేకుండా ఈ మొత్తాన్ని పొందే అవకాశం ఉండటం విద్యార్థులకు నిజంగా చాలా మంచి శుభవార్త అని చెప్పవచ్చు.అయితే 20 లక్షల రూపాయల కంటే ఎక్కువ డబ్బు రుణం తీసుకునే విద్యార్థులు మాత్రం తప్పనిసరిగా ప్రాసెసింగ్ ఫీజును చెల్లించాల్సి ఉంటుంది. ఇంకా అలాగే ఎక్కువ మొత్తం రుణాన్ని పొందాలని భావించే వాళ్లు ఆస్తులను కూడా తనఖా పెట్టి రుణాన్ని పొందాల్సి ఉంటుంది.


ఇంకా అంతే కాకుండా దానిపై 8.3 శాతం నుంచి ఈ వడ్డీ రేటు కూడా ఉంటుంది . కాబట్టి అత్యవసరం ఉన్న వారు మాత్రమే ఈ లోన్ తీసుకుంటే మంచిది. ఇక విదేశాలలో విద్యను అభ్యసించే వాళ్లు గరిష్టంగా కోటిన్నర రూపాయల దాకా లోన్ తీసుకునే అవకాశం ఉంటుంది. అయితే వారు లోన్ కోసం అవసరమైన డాక్యుమెంట్లను ఖచ్చితంగా మంజూరు చేసి ఈ లోన్ ను పొందవచ్చు.ఇంకా అంతే కాకుండా మన దేశంలో విద్యను అభ్యసించే విద్యార్థులు కూడా గరిష్టంగా 50 లక్షల రూపాయల దాకా రుణాన్ని పొందే అవకాశం ఉంటుంది. అయితే విద్యార్థులు చదివే కోర్సుల ఆధారంగా ఈ లోన్ పరిమితిలో అనేక మార్పులు ఉంటాయి. కాబట్టి అర్హత ఇంకా అలాగే ఆసక్తి ఉన్న విద్యార్థులు సమీపంలోని ఎస్బిఐ బ్రాంచ్ కు వెళ్లి లోన్ కోసం ధరకాస్తు చేసుకోవచ్చు. రోజురోజుకు ఖర్చులు ఊహించని స్థాయిలో పెరుగుతుండటం వల్ల ఈ నేపథ్యంలో విద్యార్థులు ఎడ్యుకేషన్ లోన్ ద్వారా తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలను పొందడానికి ఎస్బిని ఈ స్కీం ని ప్రవేశ పెట్టడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: