AP: జాబ్ క్యాలెండర్ విడుదల చెయ్యాలని నిరసనలు!

Purushottham Vinay
రోజు రోజుకి చదువుకునేవారు ఎక్కువయ్యారు. ఎన్నో లక్షల మంది డిగ్రీలు అయిపోయిన వారు ప్రతి సంవత్సరం బయటకి వస్తున్నారు.ఉద్యోగాలు లేక ఎన్నో పాట్లు పడుతున్నారు.అలాగే ఒక పక్క గవర్నమెంట్ కూడా జాబ్ నోటిఫికెషన్స్ రిలీజ్ చెయ్యడం లేదు.పైగా చదువుకున్నవారు చాలా ఎక్కువ అవ్వడంతో విడుదల చేస్తున్న ఖాళీలు కూడా సరిపోవట్లేదు. 100 ఖాళీలు ఉంటే వాటికి లక్షల మంది అప్లై చేసుకుంటారు. 100 మందికి ఉద్యోగాలు వస్తే మిగతా వారు ఖాళీగా ఉండాల్సిన పరిస్థితి ఈరోజుల్లో నెలకొంది.ఇక ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగుల కోసం జాబ్‌ క్యాలెండర్‌ను విడుదల చేయాలని కోరుతూ తెలుగు యువత ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా కూడా ఇవాళ నిరసన కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది.ఏపీ సీఎం జగన్‌ మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా మోసం చేస్తున్నారని పలు జిల్లాలో వినూత్న నిరసనలు చేపట్టడం జరిగింది.ఇంకా అలాగే ప్రభుత్వ శాఖల్లో కూడా ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయకుంటే ఆందోళనను ఉదృతం చేస్తామని యువత నాయకులు హెచ్చరించడం జరిగింది.


అలాగే అన్నమయ్య జిల్లా మదనపల్లెలో టమోటాలు అమ్మి నిరసన తెలుపగా శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో కారు తుడిచి, చెప్పులు కుట్టి ఇంకా ఇస్త్రీ చేసి నిరసన తెలిపారు. ప్రతి సంవత్సరం జనవరి నెలలో జాబ్‌ క్యాలెండర్‌ ఇస్తామని కూడా ఏపీ సీఎం జగన్‌ మోహన్ రెడ్డి ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు.తిరుపతి, కడప జిల్లాలో ధర్నాలు ఇంకా అలాగే రాస్తారోకోలు నిర్వహించారు. జాబ్‌లు రావాలంటే జగన్‌ మోహన్ రెడ్డి పోవాలని నినాదాలు చేశారు.అలాగే తిరుపతిలో కూడా రిక్షాలు తొక్కుతూ నిరుద్యోగులు నిరసనలు చేపట్టారు. జాబ్ క్యాలెండర్‌ చేపట్టకపోవడంలో ప్రతిభ గల నిరుద్యోగులు రిక్షాలు ఇంకా అలాగే ఆటోలు తోలవలసి వస్తుందని తెలిపారు. అలాగే కడపలో నిర్వహించిన నిరసనలో పోలీసులు తెలుగు యువత నాయకులను బలవంతంగా అరెస్టు చేసి స్టేషన్‌కు కూడా తరలించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: