ఒమిక్రాన్ ఎఫెక్ట్ : తమిళనాడులో పాఠశాలలు బంద్..ఎప్పటివరకు అంటే..?
అంతర్జాతీయ ప్రయాణ చరిత్రలేని వ్యక్తులు ఇన్ఫెక్షన్ కు గురవుతున్నందున తమిళనాడులో కొవిడ్ కేసులు చాలా మందిని ఆశ్యర్యానికీ గురి చేసాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని రాష్ట్రప్రభుత్వం పాఠశాలలను మూసేయాలని నిర్ణయించింది. రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన కొత్త ఆంక్షల ప్రకారం.. 9 నుంచి 12 తరగతుల పాఠశాలలు, కొవిడ్-19 భద్రతా ప్రొటోకాల్లను అనుసరించి పని చేస్తాయి. దీంతో పాటు తమిళనాడులోని కళాశాలలు కూడా కొవిడ్ తగిన ప్రవర్తనతో ఆఫ్లైన్ తరగతులను కొనసాగించాలి అని సూచించారు. నివేదికల ప్రకారం.. తమిళనాడులోని పాఠశాలలు, సెలవుల అనంతరం తొలుత జనవరి 03, 2022 నుండి తిరిగి తెరవాల్సి ఉంది.
తమిళనాడులో ప్రస్తుతం జనవరి 10 వరకు ఆంక్షలు అమలులో ఉన్నాయి. కరోనా కేసులు తగ్గకపోతే.. మరింత కఠినమైన ఆంక్షలను అమలు చేయడం ద్వారా వాటిని కూడా పెంచవచ్చు. నివేదికల ప్రకారం.. తమిళనాడులోని పాఠశాలలు మొదట జనవరి 03, 2022 నుంచి తిరిగి తెరవాల్సి ఉంది. మరొకవైపు తమిళనాడులో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా చెన్నైతో పాటు పొరుగు జిల్లాలలోని పాఠశాలలు మూతపడ్డాయి.
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సోమవారం పోరూర్లోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో చిన్నారులకు కరోనా వ్యాక్సినేషన్ శిబిరాన్ని కూడా ప్రారంభించనున్నారు. దేశంలో ఉన్నటువంటి 15-18 ఏళ్ల వయస్సుగల పిల్లలకు కరోనా టీకాలు వేయడం జనవరి 03 నుంచి ప్రారంభమవ్వనున్నది. ఈ టీకాల కోసం రిజిస్ట్రేషన్లు జనవరి 01 నుంచే ప్రారంభమైన విషయం విధితమే.