దేశంలో టాప్ ఐఐటీలు ఇవే.. లేటెస్ట్ రిపోర్ట్..?
ఈ ఏడాది అటల్ ర్యాంకింగ్స్ తొలి పది స్ధానాల్లో దేశంలోని ఏడు ఐఐటీలు ఉన్నాయట. అలాగే బెంగళూరులోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ కూడా ఈ అటల్ ర్యాంకింగ్స్లో స్థానం సంపాదించింది. మరి ఇంతకీ ఐఐటీల్లో టాప్ ఏది అంటారా.. అది మద్రాస్ ఐఐటీ. ఈ మద్రాస్ ఐఐటీ అటల్ ర్యాంకింగ్స్లో తొలి స్ధానం సంపాదించింది. ఆ తర్వాత స్థానాల్లో ఐఐటీ బాంబే, ఐఐటీ దిల్లీ, ఐఐటీ కాన్పూర్, ఐఐటీ రూర్కీ ఉన్నాయి.
ఇక బెంగళూరులోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ ఆరో ర్యాంకింగ్ సంపాదించింది. ఆ తర్వాత ఏడో స్ధానాన్ని మన ఐఐటీ హైదరాబాద్ దక్కించుకుంది. కొత్త ఆలోచనలు, స్టార్టప్ పరిశ్రమలు, వ్యాపార నిర్వహణకు ప్రోత్సాహం అనే విషయాల్లో దేశంలోని ఉన్నత విద్యా సంస్ధలకు ఓ క్రమ పద్ధతిలో ర్యాంకింగ్ ఇస్తుంటారు. కేంద్ర విద్యాశాఖ ఇచ్చే ఈ ర్యాంకులకు చాలా ప్రామాణికత ఉంటుంది.
ఈ ర్యాంకులను లెక్కేసేటప్పుడు అనేక విషయాలను దృష్టిలో పెట్టుకుంటారు. కొత్త ఆలోచనలను ప్రోత్సహించే సంస్థలకు ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. ఐఐటీల్లోని మౌలిక సదుపాయాలను కూడా ర్యాంకింగ్స్ విషయంలో పరిగణనలోకి తీసుకుంటారు. మొత్తానికి ఈ ఏడాది ఐఐటీ చెన్నై మరోసారి టాప్ ఐఐటీగా నిలిచిందన్నమాట.