యూజిసి అకడమిక్ పూర్తి వివరాలివే..

Purushottham Vinay
యూనివర్శిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ) ప్రస్తుత విద్యాసంవత్సరానికి (2021-22) గాను అకడమిక్‌ క్యాలెండర్‌ను విడుదల చేయడం జరిగింది. ఇక ఈ క్యాలెండర్‌ ప్రకారం అన్ని యూనివర్సిటీలు ఇంకా కాలేజీల్లో ఆగస్టు 1 నుంచి ప్రవేశాలు స్టార్ట్ అవుతాయి. ఇక అక్టోబర్‌ 1 నుంచి కొత్త సెషన్‌ అనేది మొదలవుతుందట.ప్రస్తుతం వున్న కరోనా మహమ్మారి పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని 2021-22 విద్యా సంవత్సరంలో కళాశాలలు అలాగే విశ్వవిద్యాలయాల పనితీరుకు సంబంధించి యూజీసీ ఇటీవల కొత్త మార్గదర్శకాలను విడుదల చేయడం జరిగింది. ఇక అన్ని విశ్వవిద్యాలయాలు 2021 సెప్టెంబర్ 30 లోపల ప్రవేశాల ప్రక్రియను పూర్తి చేయాలని అకడమిక్‌ క్యాలెండర్‌లో ఆదేశించడం జరిగింది.ఇక ఖాళీగా ఉన్న సీట్లను భర్తీ చేయడానికి అక్టోబర్ 31 వరకు సమయం కేటాయించారు. ఏమైన కారణాల వల్ల 12 తరగతి బోర్డు ఫలితం ఆలస్యం అయితే మాత్రం అక్టోబర్ 18 నుంచి కొత్త సెషన్ ప్రారంభించవచ్చునని తన మార్గదర్శకాల్లో యూజీసీ పేర్కొనడం జరిగింది.

ఇక ఆఫీషియల్ నోటీసు ప్రకారం చూసుకున్నట్లయితే టెర్మినల్ సెమిస్టర్ ఇంకా ఫైనల్ ఇయర్ పరీక్షలు (2020-2021) తప్పనిసరిగా ఆగస్టు 31 లోపు నిర్వహించాల్సి ఉంటుందట. ఇక అలాగే కరోనా మహమ్మారి దృష్ట్యా అక్టోబర్ 31 వరకు కూడా ప్రవేశాలను రద్దు చేసిన విద్యార్థుల నుంచి విశ్వవిద్యాలయం రద్దు ఫీజు వసూలు చేయకూడదట.డిసెంబర్ 31 వరకు ప్రవేశాన్ని క్యాన్సిల్ చేసిన విద్యార్థికి ప్రాసెసింగ్ ఫీజు గరిష్టంగా 1000 రూపాయలు వసూలు చేయవచ్చు. ఇక సెషన్ ఆన్‌లైన్‌లో లేదా ఆఫ్‌లైన్‌లో నడుస్తుందో లేదో నిర్ణయాధికారం యూజీసీ ఆయా రాష్ట్రాలకు వదిలివేయడం జరిగింది. విద్యాసంస్థల క్యాలెండర్, మార్గదర్శకాలను ఎన్‌ఐసీటీఈ మరియు ఎన్‌సీటీఈ ఇంకా బీసీఐ అలాగే ఎన్‌ఎంసీ, ఇంకా డీసీఐ తో పాటు ఎన్‌ఐసీ మరియు పీసీఐ ఇంకా ఆయుష్ వంటి విద్యాసంస్థలతో సంప్రదించిన తర్వాత జారీ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: