ఒకటి, పది తరగతుల సిలబస్ ను ఖరారు చేసిన ప్రభుత్వం.. వెబ్ సైట్ లో మరిన్ని వివరాలు..
ఈ మేరకు ఏపి ప్రభుత్వం నవంబర్ 2 నుంచి పాఠశాలలు, కాలేజీలు తెరుచుకొనున్నాయి.. ఇక పోతే తెలంగాణ లో కూడా పాఠశాలలు మొదలు కానున్నాయి. అందుకోసం ఒకటి , పది తరగతులకు సిలబస్ ను ఖరారు చేసారు. సిలబస్ లోని అధ్యాయాలను తరగతి గదిలో బోధించాల్సినవి, ప్రాజెక్టు ఆధారితమైనవి అంటూ రెండుగా విభజించింది. ప్రాజెక్టు ఆధారిత అధ్యాయాలకు సంబంధించిన సిలబస్ బోర్డు పరీక్షలకు సంబంధించి ఉంటుందని విద్యా శాఖ వెల్లడించింది.
వచ్చే ఏడాది విద్యా సంవత్సరం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలంగాణ సర్కార్ పేర్కొన్నారు. డీఈవోలు, ఆర్జేడీలు ప్రధానోపాధ్యాయులకు సూచనలు ఇవ్వాలని ఆదేశించారు. విద్యార్థులు ఏడు నెలల నుంచి ఖాళీగా ఉండి పాఠ్యాంశాలను మర్చిపోయారు. కొత్త సిలబస్ ను వారికి అర్థమయ్యే రీతిలో విద్యార్థులకు చెప్పాలని ఆదేశించారు. మ్యాథ్స్ 30 శాతం, పిజిక్స్ 27 శాతం, న్యాచురల్ సైన్స్ 30 శాతం, సోషల్ 29 శాతం, ఇంగ్లిష్ లో 25 శాతం ప్రాజెక్టు ఆధారిత సిలబస్ లో చేర్చారు. అయితే వాటినుంచి పరీక్షల్లో ప్రశ్నలు రావు. ఏయే తరగతుల్లో ఏ అధ్యాయాలను ప్రాజెక్టుల కోసం కేటాయించారో పూర్తి వివరాలను..
https:/www.scert.telangana.gov.in/ అనే వెబ్సైట్లో చూసుకోవచ్చునని తెలిపారు.