ఈసీఐఎల్లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. పూర్తి వివరాలు ఇవే!!
అయితే ఇలాంటి సమయంలో హైదరాబాద్ ప్రధానకేంద్రంగా ఉన్న ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఈసీఐఎల్) ఉద్యోగాలు భర్తీ చేసేందుకు సిద్ధం అయింది. ఈ మేరకు నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్లో మొత్తం 25 ఖాళీలు ఉన్నాయి. టెక్నికల్ ఆఫీసర్, సైంటిఫిక్ అసిస్టెంట్, టెక్నికల్ అసిస్టెంట్, జూనియర్ ఆర్టిజన్ పోస్టులున్నాయి. వీటి వివరాలు ఇలా ఉన్నాయి. మొత్తం 25 ఖాళీల్లో.. టెక్నికల్ ఆఫీసర్ - 9, సైంటిఫిక్ అసిస్టెంట్ - 8, టెక్నికల్ అసిస్టెంట్ - 1 మరియు జూనియర్ ఆర్టిజన్ - 7 పోస్టులు ఉన్నాయి. విద్యార్హత విషయానికి వస్తే.. పోస్టును అనుసరించి సంబంధిత ట్రేడుల్లో/ సబ్జెక్టుల్లో ఐటీఐ, డిప్లొమా (ఇంజినీరింగ్), ఇంజినీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
అలాగే కనీసం ఏడాది అనుభవం ఉండాలని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నోటిఫికేషన్లో పేర్కొంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు.. ఆగస్టు 31, 2020 నాటికి టెక్నికల్ ఆఫీసర్ పోస్టులకు 30 ఏళ్లు, మిగిలిన వాటికి 25 ఏళ్లు మించకూడదని తెలిపింది. షార్ట్లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఈ పోస్టులకు ఎంపిక విధానం ఉంటుంది. వేతనం వివరాలు చూస్తే.. టెక్నికల్ ఆఫీసర్ పోస్టులకు నెలకు రూ.23,000, సైంటిఫిక్ అసిస్టెంట్, టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులకు నెలకు రూ.19,864, జూనియర్ ఆర్టిజన్ పోస్టులకు రూ.18,070 లభిస్తుంది. ఇక ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభం అయింది. అప్లై చేయడానికి ఆగస్టు18, 2020 చివరి తేది. ఆసక్తిగల అభ్యర్థులు నోటిఫికేషన్ పూర్తి వివరాలు తెలుసుకుని.. దరఖాస్తు చేసుకోవలెను. ఈ నోటిఫికేషన్ పూర్తి వివరాల కోసం :https://careers.ecil.co.in/