మీ అంకెలు నమ్మను.. అధికారులకు చుక్కలు చూపిస్తున్న చంద్రబాబు?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారుల పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అమరావతి సచివాలయంలో ముగిసిన రెండు రోజుల డిస్ట్రిక్ట్ కలెక్టర్ల సదస్సులో ఆయన మాట్లాడుతూ అంకెలు నమ్మనని స్పష్టం చేశారు. ఆకస్మిక తనిఖీలు చేస్తానని హెచ్చరించారు. ప్రజల సంతుష్టి మాత్రమే అధికారుల పనితీరుకు కొలమానమని ఆయన అన్నారు.

 స్పీడ్ ఆఫ్ డెలివరీ ఆఫ్ గవర్నెన్స్ విధానాన్ని అమలు చేస్తున్నామని చెప్పారు. వివిధ అంశాలపై అర్థవంతమైన చర్చలు జరిగాయి. ఏప్రిల్ నుంచి సంక్షేమ క్యాలెండర్ అమలు చేయాలని నిర్ణయించారు. కేంద్రం నుంచి అదనంగా రూ.5 వేల కోట్లు రాబట్టాలని కలెక్టర్లకు సూచించారు. ప్రజలు సంతుష్టి లేకపోవడం వల్ల ప్రభుత్వం పనితీరును మరింత మెరుగుపరచాలని ఆయన ఆదేశించారు.

 రాష్ట్రంలో పెన్షన్లు పెంచినా ప్రజలు సంతుష్టి చెందడం లేదని చంద్రబాబు స్వయంగా అంగీకరించారు. సదస్సులో ఉత్తమ పద్ధతులు అవలంబించిన ఆరు జిల్లాల కలెక్టర్లు పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు ఇచ్చారు. ఈ ఆరు ఉత్తమ పద్ధతులను రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని చంద్రబాబు ఆదేశించారు.  టెక్నాలజీని ఉపయోగించి ఇన్నోవేటివ్ ఐడియాలు రూపొందించాలని సూచించారు.

ప్రభుత్వ సేవలు వేగంగా అందజేయడంపై దృష్టి సారించాలని కలెక్టర్లకు సలహా ఇచ్చారు. ఫైళ్లు క్లియర్ చేయడంలో జాప్యం లేకుండా చూడాలని ఆదేశించారు. ప్రజల విశ్వాసం సంపాదించడం అధికారుల బాధ్యతని గుర్తు చేశారు. రాష్ట్రంలో ఇన్వెస్ట్‌మెంట్స్ ఆకర్షించడంపై కూడా చర్చ జరిగింది. సింగిల్ విండో సిస్టమ్ ద్వారా ఇన్వెస్ట్‌మెంట్స్ పెరిగాయని చంద్రబాబు పేర్కొన్నారు.  విశాఖపట్నం ఇన్వెస్టర్స్ సమ్మిట్ ద్వారా రూ.13 లక్షల కోట్లు ఆకర్షించామని చెప్పారు.

 9490520108..  వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్యలు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్రజ‌ల స‌మ‌స్యలు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్యక్తిగ‌త స‌మ‌స్యలు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: