కేసీఆర్ ఫ్యామిలీని ఆ యూట్యూబ్ ఛానళ్లు టార్గెట్ చేశాయా?
కేవలం ప్రజలను అయోమయానికి గురి చేసి, తప్పుదోవ పట్టించేందుకు చేస్తున్న చర్యగా తాము భావిస్తున్నామన్న మాజీ మంత్రి కేటీఆర్.. గతంలో మాపై అసత్య ప్రచారాలను, అవాస్తవాలను ప్రసారం చేసిన, ప్రచురించిన మీడియా సంస్థలపైన కూడా న్యాయపరమైన చర్యలు ప్రారంభించామన్నారు. ప్రస్తుతం కొన్ని యూట్యూబ్ ఛానల్స్ చేస్తున్న ఈ దుర్మార్గపూరిత, కుట్రపూరిత చర్యలను చట్టబద్ధంగా ఎదుర్కొంటామని మాజీ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.
అసత్యాలను అదేపనిగా ప్రచారం చేసి, అడ్డమైన తంబు నెయిల్స్ తో వార్తల పేరిట ప్రాపగండాకు పాల్పడుతున్న యూట్యూబ్ ఛానళ్లపైన పరువు నష్టం కేసులు నమోదు చేస్తున్నామని మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. అంతే కాదు.. వీటితోపాటు క్రిమినల్ చర్యలు కూడా తీసుకుంటామని మాజీ మంత్రి కేటీఆర్ వార్నింగ్ ఇచ్చారు. దీంతోపాటు ఆయా యూట్యూబ్ ఛానళ్లను నిషేధించాలని యూట్యూబ్ కి అధికారికంగా ఫిర్యాదు కూడా చేస్తామని మాజీ మంత్రి కేటీఆర్ హెచ్చరించారు.
ఇప్పటికైనా సదరు యూట్యూబ్ ఛానళ్లు తమ తీరు మార్చుకోవాలని మాజీ మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. అదే సమయంలో కుట్ రపూరితంగా వ్యవహారం నడిపే యూట్యూబ్ ఛానళ్లు చట్ట ప్రకారం తగిన శిక్షకు సిద్దంగా ఉండాలని మాజీ మంత్రి కేటీఆర్ హెచ్చరించారు.