కేసీఆర్ ఫ్యామిలీని ఆ యూట్యూబ్‌ ఛానళ్లు టార్గెట్‌ చేశాయా?

బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన యూట్యూబ్ ఛానళ్లు కొన్ని, ఏలాంటి ఆధారాలు లేకుండా అడ్డగోలుగా, అసత్యాలను పదేపదే ప్రసారం చేస్తున్నాయని బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌ అంటున్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించేలా తంబ్ నెయిల్స్ పెడుతూ, వార్తల పేరుతో శుద్ద అబద్దాలను చూపిస్తున్నాయని మాజీ మంత్రి కేటీఆర్‌ మండిపడ్డారు. గుడ్డి వ్యతిరేకత వలనో లేదా అధికార పార్టీ ఇచ్చే డబ్బులకు ఆశపడి ఇలాంటి నేరపూరితమైన, చట్టవిరుద్ధమైన వీడియోలను, ఫేక్ న్యూస్ లను సదరు యూట్యూబ్‌ ఛానళ్లు ప్రచారం చేస్తున్నాయన్న మాజీ మంత్రి కేటీఆర్‌... ఇది వ్యక్తిగతంగా నాతోపాటు, మా పార్టీని దెబ్బతీయాలన్న కుట్రలో భాగంగానే జరుగుతున్నదని భావిస్తున్నామన్నారు.

కేవలం ప్రజలను అయోమయానికి గురి చేసి, తప్పుదోవ పట్టించేందుకు చేస్తున్న చర్యగా తాము భావిస్తున్నామన్న మాజీ మంత్రి కేటీఆర్‌.. గతంలో మాపై అసత్య ప్రచారాలను, అవాస్తవాలను ప్రసారం చేసిన, ప్రచురించిన మీడియా సంస్థలపైన కూడా న్యాయపరమైన చర్యలు ప్రారంభించామన్నారు. ప్రస్తుతం కొన్ని యూట్యూబ్ ఛానల్స్ చేస్తున్న ఈ దుర్మార్గపూరిత, కుట్రపూరిత చర్యలను చట్టబద్ధంగా ఎదుర్కొంటామని మాజీ మంత్రి కేటీఆర్‌ స్పష్టం చేశారు.

అసత్యాలను అదేపనిగా ప్రచారం చేసి, అడ్డమైన తంబు నెయిల్స్ తో వార్తల పేరిట ప్రాపగండాకు పాల్పడుతున్న యూట్యూబ్ ఛానళ్లపైన పరువు నష్టం కేసులు నమోదు చేస్తున్నామని మాజీ మంత్రి కేటీఆర్‌ తెలిపారు. అంతే కాదు.. వీటితోపాటు క్రిమినల్ చర్యలు కూడా తీసుకుంటామని మాజీ మంత్రి కేటీఆర్‌ వార్నింగ్ ఇచ్చారు. దీంతోపాటు ఆయా యూట్యూబ్ ఛానళ్లను నిషేధించాలని యూట్యూబ్ కి అధికారికంగా ఫిర్యాదు కూడా చేస్తామని మాజీ మంత్రి కేటీఆర్‌ హెచ్చరించారు.

ఇప్పటికైనా సదరు యూట్యూబ్‌ ఛానళ్లు తమ తీరు మార్చుకోవాలని మాజీ మంత్రి కేటీఆర్‌ విజ్ఞప్తి చేశారు. అదే సమయంలో కుట్ రపూరితంగా వ్యవహారం నడిపే యూట్యూబ్ ఛానళ్లు చట్ట ప్రకారం తగిన శిక్షకు సిద్దంగా ఉండాలని మాజీ మంత్రి కేటీఆర్‌  హెచ్చరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

kcr

సంబంధిత వార్తలు: