నేడే టెట్ పరీక్ష.. ఈ రూల్స్ మస్ట్?
టెట్ జరగనున్న విద్యా సంస్థలకు ప్రభుత్వం పూర్తిగా సెలవు ప్రకటించింది. పరీక్ష కోసం 2 వేల 52 చీఫ్ సూపరింటెండెంట్లు, 22 వేల 572 మంది ఇన్విజిలేటర్లు, 10 వేల 260 మంది హాల్ సూపరింటెండెట్లను నియమించింది. పరీక్ష పూర్తయ్యే వరకు కేంద్రాల నుంచి అభ్యర్థులు బయటకు వెళ్లేందుకు అనుమతించరు. ఇక మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి లేదు. బ్లాక్ బాల్ పాయింట్ పెన్నుతో ఓఎంఆర్ పత్రాల్లో సర్కిళ్లను దిద్దాలి. ఈనెల 27న టెట్ ఫలితాలను వెల్లడిస్తారు.
జాతీయ ఉపాధ్యాయ విద్య మండలి నిబంధనల ప్రకారం, ఒకటి నుంచి ఎనిమిదో తరగతి వరకు బోధించాలంటే తప్పనిసరిగా టెట్ అర్హత ఉండాలి. తెలంగాణలో ఇప్పటివరకు అన్ని టెట్ లు కలిపి పేపర్ 1 లో లక్షన్నర.. పేపర్ 2 లో రెండున్నర లక్షల మంది అభ్యర్థులు ఉత్తీర్ణులయ్యారు. చివరగా గతేడాది జూన్ 12న టెట్ నిర్వహించారు. టెట్ అర్హత కాల పరిమితి జీవితకాలం ఉంటుందని తెలిపారు.
ఉపాధ్యాయ నియామకాల కోసం డీఎస్సీ నోటిఫికేషన్ ఇప్పటికే జారీ అయిన సంగతి తెలిసిందే. నవంబరు 20 నుంచి 30 వరకు ఉపాధ్యాయ నియామక పరీక్ష ఉంటుంది. దీని కోసం ఈనెల 20 నుంచి అక్టోబరు 21 వరకు డీఎస్సీ దరఖాస్తులను స్వీకరిస్తారు.