చంద్రయాన్‌ ఓకే.. ఇక సూర్యుడే ఇస్రో టార్గెట్‌?

ఇస్రో చంద్రయాన్ 3 ప్రయోగం ఇక దగ్గరకొచ్చింది. కక్ష తగ్గింపు ప్రక్రియ విజయవంతంగా పూర్తి చేసినట్లు కేవలం జాబిల్లికి 167 కిలోమీటర్ల దూరంలోనే ల్యాండర్ ఉన్నట్లు ప్రకటించింది. ఇక ఆగస్టు 23 వ తేదీ నాడు చంద్రుడిపై అన్ని ల్యాండర్ ను దించేందుకు సిద్దంగా ఉన్నట్లు చెప్పారు. దీంతో చంద్రయాన్ 3 ప్రయోగంపై అందరికీ ఆసక్తి నెలకొంది. భూమి నుంచి చంద్రుడి కక్షలోకి విజయవంతంగా ప్రవేశపెట్టిన ఇస్రో ప్రస్తుతం చివరి కక్ష ను కూడా తగ్గించి జాబిల్లికి అతి చేరువలోకి తీసుకొచ్చింది.


అయితే ఇస్రోలో సెప్టెంబర్ మెదటివారంలో ఆదిత్య ఎల్ 1 అనే పేరుతో అంతరిక్ష నౌకను ప్రయోగించనుంది. ఇస్రో తన అధికార సోషల్ మీడియాలో వెల్లడించింది. బెంగళూరులోని యూఆర్ రావు శాటిలైట్ సెంటర్ నుంచి శ్రీహరి కోటలోకి షార్ కు చేరుకుంది. షార్ లోని రెండో ప్రయోగ వేదిక నుంచి పీఎస్ ఎల్వీ ఆదిత్య ఎల్ 1 రాకెట్ ను ప్రయోగిస్తారు. సీ 57 రాకెట్ ద్వారా ఆదిత్య ఎల్ 1 స్పేస్ క్రాప్టు ప్రయోగిస్తారు. ఇక్కడ వెహికల్ అనుసంధానం బిల్డింగ్ లో మూడు రకాల అనుసంధానం బిల్డింగ్ పూర్తి చేస్తారు. ఆదిత్య ఎల్ 1కి గ్రీన్ రూంలో పరీక్షల అనంతరం రాకెట్ కు శిఖర భాగంలో అమర్చుతారు.


ఈ ప్రయోగం ద్వారా సూర్యుడు, భూమి కి మధ్య ఉన్న లాంగ్ రేంజ్ వ్యవస్థలో ఎల్ 1 చుట్టూ ఉన్న కక్షలోకి ప్రవేశపెడతారు. ఇది భూమికి 10.5 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉంది. అక్కడి నుంచి సూర్యుడిపై అధ్యయనం చేయడానికి అడ్డంకులు ఉండవని సైంటిస్టులు చెబుతున్నారు. కానీ ఈ విషయం గురించి పూర్తిగా తెలుసుకోకుండా కొంతమంది స్వయం ప్రకటిత మేధావులు చంద్రుడి మీద ప్రయోగం అయిపోయింది. ఇక సూర్యుడి మీదకే ప్రయాణం అని వితండ వాదానికి దిగుతున్నారు. అసలు నిజాన్ని తెలుసుకోవాలని సైంటిస్టులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: