ఏది నిజం?: ఆంధ్రా ఆదాయం అంతగా పెరిగిందా?

తెలుగు రాష్ట్రానికి సంబంధించిన ఆదాయం పడిపోతుందని కొంతమంది చెప్తున్న మాటల్లో నిజం లేదని అంటున్నారు. ఇంకా చెప్పాలంటే రాష్ట్ర ఆదాయ లెక్కలకు సంబంధించిన వివరాలు ప్రకారం ఆదాయం పెరుగుతుందే గాని తగ్గడం లేదని తెలుస్తుంది. ఆ పెరగడం కూడా భారీగా పెరుగుతుందట. రాష్ట్రం నుండి వచ్చే పన్నుల నుండి గాని, అలాగే కేంద్రం నుండి వచ్చే వాటన్నిటినీ కలిపితే  రాష్ట్రం ఆదాయం లక్ష 77వేల కోట్లకు చేరుకుందని తెలుస్తుంది.


ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సమయంలో కన్నా కూడా ఇప్పుడు రాష్ట్ర ఆదాయం అనేది విపరీతంగా పెరిగిందని తెలుస్తుంది. అది కూడా అప్పటి ఆదాయం కంటే కూడా రెండు మూడు రెట్లు అధికంగా పెరిగిందని అంటున్నారు. గతంలో 23 వేల కోట్ల ఆదాయం ఉంటే ఇప్పుడు 177వేల కోట్లకు అది కాస్తా పెరిగిందని తెలుస్తుంది‌. చంద్రబాబు నాయుడు హయాంలో కూడా ఈ రాష్ట్ర ఆదాయం 1,17,000కోట్ల వరకు పెరిగిందట.


కానీ అది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి హయాంకు వచ్చేసరికి లక్ష 77వేల కోట్లకు చేరుకుంది. అయితే జగన్మోహన్ రెడ్డి హయాంలో రాష్ట్ర ఆదాయం పెరిగితే చంద్రబాబు నాయుడు చెప్పలేదు. అదే విధంగా జగన్ కూడా చంద్రబాబు నాయుడు టైంలో పెరిగిన ఆదాయ వివరాలను చెప్పలేదు. ఎందుకంటే వారి వారి హయాంలో ఈ ఆదాయం పెరిగింది అని చెప్పాల్సి వస్తుందని ఆ విధంగా చేస్తారు అని అనుకుంటున్నారు.  ఇలా ప్రతి ఏడాది రాష్ట్ర ఆదాయం పెరుగుతుందే గాని తగ్గడం లేదని తెలుస్తుంది.


కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో కూడా రాష్ట్ర ఆదాయం పెరిగిందట. దేశంలో జిఎస్టి కి సంబంధించిన పెరుగుదల కూడా ఒక కీలకమైన పరిణామంగా కనిపిస్తుంది. కానీ మొన్నటి వరకు కూడా  తెలుగు రాష్ట్రాల  అప్పులు మీదే కాన్సన్ట్రేట్ చేశాయి కొన్ని పచ్చ పత్రికలు. ఈ పత్రికలు ఆంధ్ర రాష్ట్రంలో పెరుగుతున్న ఆదాయం విషయం తెలిసి మరీ అప్పుల విషయాన్ని మాత్రమే వ్రాసుకుంటూ వచ్చేవి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: