గ్రేట్: భారత్కు ప్రపంచంలోనే రెండో స్థానం!
ఇండియా ప్రస్తుతం చైనాను క్రాస్ చేసి రెండో స్థానానికి చేరుకుంది. మొదటి స్థానంలో యూఎస్ ఉంది. 2013 లో ఇండియాలో 91287 కిలోమీటర్ల రహదారులు ఉంటే ఈ తొమ్మిదేళ్లలో అది 1.45 లక్షల కిలోమీటర్లకు చేరుకుందని తెలుస్తోంది. ఈ తొమ్మిదేళ్లలోనే 1.45 లక్షల కిలోమీటర్ల రోడ్లు వేయడం ద్వారా భారత్ ఈ ఘనత సాధించినట్లు తెలుస్తోంది. చైనాను దాటేసి అమెరికాతో పోటీ పడే స్థాయికి పెరిగింది.
దీంతో దాదాపు కాంగ్రెస్ దాదాపు 60 ఏళ్ల పాటు దేశాన్ని పాలించిన సమయంలో 94 వేల కిలోమీటర్ల మేర దారి వేస్తే ఈ తొమ్మిదేళ్లలో ఇంత వేగంగా 1.45 లక్షల కిలోమీటర్ల రోడ్లు వేయడం అనేది రికార్డులలను నెలకొల్పింది. రహదారులు బాగున్నప్పుడే మౌలిక వసతులు పెరుగుతాయి. పరిశ్రమలు డెవలప్ అవుతాయి. ఉపాధి దొరుకుతుంది. ఎన్నో రకాల వ్యాపార వాణిజ్య రంగాలు మెరుగుపడతాయి. ఇలా అనేక రంగాల అభివృద్దికి నిదర్శనం రోడ్లు. వాటిని బాగు చేసుకోవాలి. నూతన రోడ్లను నిర్మించాలి. ఇదే తోవలో కేంద్ర ప్రభుత్వం నడుస్తోంది.
భారత్ మాల ద్వారా దేశంలో నూతన రోడ్ల నిర్మాణం అనేది కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పథకం. దేశంలో రోడ్ల పరిస్థితిని అంచనా వేసి నూతన రోడ్ల నిర్మాణాలను చేపట్టాలి. మారుమూల ప్రాంతాలకు సైతం రోడ్లను వేయడం ద్వారా ఆయా ప్రాంతాల ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచవచ్చని నిర్ణయం తీసుకుంది. రహదారుల నిర్మాణంలో రెండో స్థానానికి చేరుకోవడం అనేది గర్వించదగిన విషయం.