ఇక మోదీని, బీజేపీని ఎల్లోమీడియా క్షమించేస్తుందా?
అయితే ఇన్నాళ్లూ బీజేపీ పై దుమ్మెత్తి పోసిన తెలుగు దేశం అనుకూల మీడియా, పత్రికలు ఇకపై బీజేపీ గురించి వ్యతిరేక వార్తలు రాయవు. ఎందుకంటే చంద్రబాబు వెళ్లి కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో మాట్లాడటం వెనక పొత్తు విషయం దాగి ఉందని సూచన ప్రాయంగానే ఆ పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఇన్ని రోజులు తిట్టినా, వ్యతిరేక వార్తలు రాసిన పత్రికలు ఇప్పుడు ఎలా రాస్తాయో అని ఆయా పార్టీల నేతలు మాట్లాడుకుంటున్నారు.
ముఖ్యంగా టీడీపీకి అనుకూలంగా ఒక వర్గం మీడియా ఉందని అందరికీ తెలిసిన విషయమే. ఇఫ్పుడు అదే మీడియా బీజేపీ గురించి టీడీపీతో పొత్తు విషయం కుదిరితే భవిష్యత్తు మళ్లీ ప్రధాని మోదీదే అని చెబుతూ వార్తలు ప్రసారం చేసినా ఏ మాత్రం ఆశ్చర్యపోనక్కర్లేదని తెలుస్తోంది. ఇన్ని రోజులు జగన్ కేంద్ర ప్రభుత్వం బీజేపీకి అనుకూలంగా ఉంటూ వచ్చారు. బీజేపీ గురించి వ్యతిరేక వార్తలు సాక్షి మీడియా, పత్రిక మాత్రమే ఇన్ని రోజుల నుంచి రాయలేదు.
అలాంటిది ఇప్పుడు సాక్షి పత్రిక బీజేపీకి మోదీకి వ్యతిరేకంగా వార్తలు రాస్తారా? నిజంగా జగన్ బీజేపీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తే ఆంధ్రలో ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి. బీజేపీని ఎదిరించే శక్తి జగన్ కు ఉందా? ఒక వేళ జాతీయ కాంగ్రెస్ జగన్ ను దగ్గర తీస్తుందా. ఏమో ఎన్నికల నాటికి రాజకీయాలు ఎలాగైనా మారొచ్చని కొంతమంది నేతలు అభిప్రాయపడుతున్నారు.