నోరు జారిన చంద్రబాబు.. వైసీపీ కుమ్మేస్తుందా?

మనిషి చనిపోతే ఆరడుగుల జాగ చాలు అంటారు. ఎంత సంపాదించి ఏం చేసినా ఆరడుగుల జాగా లోనే సమాధి అయ్యేది అంటూ సామెతలు చెబుతుంటారు.  అలాంటి స్మశానంతో పేదవాడి ఇళ్లను పోల్చారు చంద్రబాబు నాయుడు. చాలా మంది పేదవారు ఉండే స్థలాలను డబ్బులు ఎక్కువ ఉన్న ధనవంతులు  మురికి వాడలతో పోల్చేవారు.  పేదవారిని చిన్నచూపు చూడటంలో అందరికి అలూసే.. ఇపుడు అలాంటిది ఏకంగా 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.  

జగన్ అమరావతి లో పేదవారికి ఇళ్ల స్థలాలు  ఇవ్వాలని అనుకున్నారు. ఒక సెంట్ భూమి ఇవ్వాలని నిర్ణయించారు. అయితే చంద్రబాబు గారి దృష్టిలో ఒక సెంట్ భూమి అంటే శ్మశానం. 48 గజాలు భూమిని శ్మశానం తో పోల్చారు. అది రాజకీయ విమర్శ కూడా ఇంత దిగజరుడుగా ఉంటుందని ఎన్నడు ఉహించలేమని వైసీపీ నాయకులు విమర్శలు చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ అమరావతి రాజధానిలో పేదలకు నేను ఎప్పుడో ఇల్లు రిజస్ట్రేషన్ చేశాను అని అంటున్నారు. అయితే ఇంతవరకు వాటిని ఎందుకు ఇవ్వలేదనే వాదన వినిపిస్తోంది. 350 గజాల భూమి అయితే దానిని ఆర సెంటుగా, 480 గజాల భూమి అయితే సెంట్ భూమి గా పరిగణించవచ్చు.

మరి అధికారంలో ఉన్నపుడు చంద్రబాబు నాయుడు ఎందుకు కూడా చంద్రబాబు నాయుడు ఇల్లు ఎందుకు నిర్మించి ఇవ్వలేదని  వైసీపీ నాయకులు విమర్శిస్తున్నారు.  ఆ రోజునే స్థలం ఇచ్చి ఇళ్ళు కట్టించి ఉంటే.. పేదవారికి ఎంతో కొంత లాభం చేసి ఉండేవారు కదా.. ఎందుకు పేదలకు ఇళ్లు కట్టి ఇవ్వలేదని అంటున్నారు రాజధాని అమరావతి ప్రాంత ప్రజలు దేవుడిగా చంద్రబాబు ను చూసే వారు కదా అయిన ఎందుకు ఇవ్వలేదు.  ఒక వేళ ఇస్తే అవి మురికివాడల మాదిరి అవుతాయని దురుద్దేశం తోనే ఇవ్వలేదని వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: