ఆనంద్ రూప పాత్ర వెనుక సీక్రెట్ అప్పట్లో షాకింగ్ డిసిషన్!
కమలినీ ముఖర్జీ ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమై, ఓవర్నైట్ స్టార్ అయిపోయారు. కానీ, దర్శకుడు శేఖర్ కమ్ముల ఈ పాత్ర కోసం ముందుగా అనుకున్న హీరోయిన్ కమలినీ కాదు. ఆయన సదా ను ఈ పాత్ర కోసం సంప్రదించారట. ఆ సమయంలో సదా టాలీవుడ్లో ఫుల్ ఫామ్లో ఉన్నారు. తేజ దర్శకత్వంలో వచ్చిన 'జయం' సినిమాతో ఆమె సెన్సేషన్ క్రియేట్ చేశారు. "వెళ్ళవయ్యా వెళ్ళూ" అనే డైలాగ్తో ఆమె యూత్లో విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించుకున్నారు.
ఆ తర్వాత ఎన్టీఆర్ సరసన 'నాగ' వంటి పెద్ద చిత్రాల్లో కూడా నటించారు. ఆ బిజీ షెడ్యూల్స్ వల్లనో లేదా ఇతర కారణాల వల్లనో కానీ, సదా 'ఆనంద్' సినిమా ఆఫర్ను తిరస్కరించినట్లు తెలుస్తోంది.సదా నో చెప్పడం కమలినీ ముఖర్జీకి వరంగా మారింది. శేఖర్ కమ్ముల తన కథకు సరిపోయే కొత్త ముఖం కోసం వెతుకుతున్న క్రమంలో కమలినీని ఎంపిక చేశారు. ఆమె బెంగాలీ అమ్మాయి అయినప్పటికీ, తన హావభావాలతో తెలుగమ్మాయిలా ఒదిగిపోయారు.