గుడ్‌న్యూస్.. ఏపీలో వంద ఎకో ప్రాజెక్టులు..?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా కనీసం వంద ఎకో టూరిజం ప్రాజెక్టులను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు రాష్ట్ర అటవీ పర్యావరణశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వివరాలు తెలియజేశారు. అటవీ శాఖపై సమీక్ష నిర్వహించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రతీ డివిజన్ స్థాయిలోనూ 5 ఎకో టూరిజం ప్రాజెక్టుల ప్రతిపాదనలు పంపాలని అధికారులకు సూచించారు. ఏపీ రాష్ట్రంలోని జంతు ప్రదర్శన శాలలకూ కొత్త జంతువులను తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెల్లడించారు.

ఏపీ రాష్ట్రంలోని విశాఖ, తిరుపతి జూలలో ప్రజలను ఆకర్షించే కొత్త జంతువులను తీసుకురావాలని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సూచించారు. ఇందుకోసం సెంట్రల్ జూ అథారిటీ అధికారులతో చర్చించి అవసరమైన అనుమతులు తీసుకోవాలని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కోరారు. కపిలతీర్థం నుంచి తిరుపతి జూ పార్క్ వరకు ట్రామ్ లేదా రోప్ వే ను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలను సిద్దం చేయాలని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశించారు.

అటవీశాఖ నుంచి ఇష్టారాజ్యంగా జారీ చేసే ఎన్ ఓసీల విషయంలో నిర్దిష్టమైన ప్రమాణ కార్యాచరణ రూపొందించాలని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సూచించారు. అటవీ భూములకు సంబంధించి ఎన్ఓసీల జారీ రికార్డులు సక్రమంగా ఉండటం లేదని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆక్షేపించారు. ఏపీ వ్యాప్తంగా 2522 ఫారెస్ట్  బ్లాక్ లలో సుమారు 37 లక్షల హెక్టార్ల అటవీ భూములు ఉన్నాయని వాటిని పరిరక్షించాలని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశించారు.

అటవీ సరిహద్దు గ్రామాల్లో వన్యప్రాణుల వల్ల జననష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కోరారు. ఏనుగులు పొలాలు, గ్రామాల్లోకి వచ్చి నష్టం చేకూరుస్తున్నాయన్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి..  అటవీ సరిహద్దుల్లో ట్రెంచ్ లను ఏర్పాటు చేయాలని సూచించారు. అలాగే జగనన్న లేఅవుట్లలోనూ మొక్కలు పెంపకం పై కార్యాచరణ సిద్ధం చేయాలని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. మరి ఈ ఎకో ప్రాజెక్టులు త్వరగా అందుబాటులోకి వస్తే ఎంత బావుంటుందో..!

మరింత సమాచారం తెలుసుకోండి:

ECO

సంబంధిత వార్తలు: