జయహో ఇండియా.. కామన్వెల్త్లో కుమ్మేశారు?
రెజ్లింగ్లో భారత్కు 5 స్వర్ణాలు, ఒక రజతం, 5 కాంస్యాలు దక్కాయి. ఇక ఆ తర్వాత వరుసలో భారత వెయిట్ లిఫ్టర్లు ఉన్నారు. వీరు మొత్తంగా 10 పతకాలు సాధించారు. వెయిట్లిఫ్టింగ్లో భారత్ ఖాతాలో 3 పసిడి, 3 రజతం, 4 కాంస్యాలు వచ్చాయి. అలాగే టేబుల్ టెన్నిస్లో భారత్కు 4 స్వర్ణాలతో పాటు మొత్తం 7 పతకాలు వచ్చాయి. టేబుల్ టెన్నిస్లో భారత్కు 4 పసిడి, ఒక రజతం, రెండు కాంస్యాలు దక్కాయి. బాక్సింగ్లో భారత్కు 3 పసిడితో పాటు మొత్తం 7 పతకాలు వచ్చాయి.
బాక్సింగ్ విషయానికి వస్తే.. భారత్ ఖాతాలో 3 స్వర్ణం, ఒక రజతం, 3 కాంస్యాలు దఖలు పడ్డాయి. బ్యాడ్మింటన్లో 3 స్వర్ణాలతో పాటు 6 పతకాలు సాధించారు. భారత షట్లర్ల ఖాతాలో 3 స్వర్ణాలు, ఒక రజతం, 2 కాంస్యాలు వచ్చి చేరాయి. ఇక అథ్లెటిక్స్ విభాగం నుంచి భారత్కు మొత్తం 8 పతకాలు లభించాయి. వీటిలో ఒక స్వర్ణంతో పాటు 4 రజతాలు, 3 కాంస్యాలు ఉన్నాయి.
లాన్బౌల్స్ క్రీడలో భారత్కు ఒక స్వర్ణం, ఒక రజతంతో పాటు 2 పతకాలు వచ్చాయి. పారా పవర్లిఫ్టింగ్లో భారత్ ఖాతాలో ఒక స్వర్ణ పతకం వచ్చింది. జూడోలో భారత్కు 2 రజతాలు, ఒక కాంస్యంతో పాటు మొత్తం 3 పతకాలు దక్కాయి. హాకీలో ఒక రజతం, ఒక కాంస్యం సహా భారత్కు మొత్తం 2 పతకాలు వచ్చాయి. ఈ ఏడాదే తొలిసారిగా ప్రవేశపెట్టిన క్రికెట్లో భారత మహిళలకు రజత పతకం దక్కింది. స్క్వాష్లో భారత్ ఖాతాలో రెండు కాంస్య పతకాలు దక్కాయి. మొత్తం మీద 61 పతకాలు సాధించిన ఇండియా కామన్వెల్త్ దేశాల్లో టాప్ ఫోర్ లో స్థానం సంపాదించుకుంది.