జగన్‌.. బటన్‌ నొక్కితే బాధ్యత తీరిపోతుందా?

ఏపీ సీఎం జగన్ వైఖరిపై జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ మండిపడుతున్నారు. గోదావరి వరద బాధితుల విషయంలో ఏపీ సర్కారు నిర్లక్ష్యం వహిస్తోందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వరద  తీవ్రత తగ్గుముఖం పట్టినా ముంపు బాధితుల ఇక్కట్లు రోజురోజుకీ పెరుగుతున్నాయని.. వందల గ్రామాల ప్రజలు వరద నీట మునిగి ఇబ్బందులు పడుతున్నారని జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

వేల మంది బాధితులు ఉంటే నామమాత్రంగా పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్‌.. వైసీపీ ప్రభుత్వం వరద పరిస్థితులపై ఏ మాత్రం అప్రమత్తంగా లేదని అర్థమవుతోందన్నారు. బటన్ నొక్కితే బాధ్యత తీరిపోయిందని వైసీపీ నాయకత్వం భావిస్తోందని.. మానవత్వంతో స్పందించి సహాయ చర్యలు చేపట్టాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ సూచించారు. వరద బాధితుల గోడును పాలకులు పట్టించుకోవడం లేదన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్‌.. బాధితులను ఆదుకోవాలని కోరితే రాజకీయం చేస్తున్నామని వైసీపీ నాయకత్వం చెబుతుందని మండిపడ్డారు.

సీఎం జగన్ ఆధ్వర్యంలోని వైసీపీ సర్కారు తమ  వైఫల్యాన్ని పక్కదోవ పట్టించే ప్రయత్నం చేస్తోందని జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ విమర్శించారు. ముంపు గ్రామాల ప్రజలను తరలించేందుకు కనీసం పడవలు కూడా ప్రభుత్వ సమకూర్చలేకపోయిందని జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. రెండేళ్ల కిందట వచ్చిన వరదల సమయంలో పడవలు, ఆహారం సమకూర్చినవారికి నేటికీ బిల్లులు చెల్లించకపోవడం వల్లే ఈ పరిస్థితులు వచ్చాయని జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ ఎద్దేవా చేశారు.

ప్రస్తుతం నీట మునిగిన ఇళ్ళల్లోనే  వరద బాధితులు బితుకుబితుకుమంటూ సహాయం కోసం చూస్తున్నారని.. పసి పిల్లలకు కనీసం పాలు కూడా అందటం లేదనే విషయం నా దృష్టికి వచ్చిందని జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ ఆవేదన వ్యక్తం చేశారు.  అన్నపూర్ణలాంటి కోనసీమ ప్రాంతంలో ఆహార పొట్లాల కోసం పెనుగులాడుకొనే పరిస్థితి కల్పించారని.. జనసేన పార్టీ నేతలు, జన సైనికులు- ఇప్పటికీ ముంపులో ఉన్న గ్రామాల్లో సహాయ చర్యల్లో నిమగ్నమై ఉన్నారని..ఆహారం, పాలు, కూరగాయలు అందిస్తున్నారని.. వారి సేవలు అభినందనీయం అంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ అభినందించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: