ప్రస్తుతం కోవిడ్ సెకండ్ వేవ్ దేశాన్ని వణికిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ ఉపద్రవాన్ని అంచనా వేయడంలోనూ.. తదనంతరం దీని వ్యాప్తి నియంత్రణకు సత్వర చర్యలు చేపట్టడంలోనూ అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలూ విఫలమయ్యాయని అంగీకరించక తప్పదు.దేశవ్యాప్తంగా వైరస్ బారిన జనం లక్షల సంఖ్యలో పడుతున్న సమయంలో రాష్ట్రాలు చేపట్టాల్సిన చర్యలపై ప్రధాని మోదీ పలువురు ముఖ్యమంత్రులతో ప్రస్తుతం చేపడుతున్న, చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు.