హెరాల్డ్ ఎడిటోరియల్ : ఎగ్జిట్ పోల్స్ తేజస్వికే ఎందుకు పట్టం కట్టాయో తెలుసా ?

Vijaya
ఎంతో ఉత్కంఠలో జరిగిన బీహార్ సాధారణ ఎన్నికలకు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో మహా గట్ బంధన్ (ఎంజీబీ) కే అధికారం అంటు తేల్చేశాయి. మహాగట్ బంధన్ అంటే మరేమిటో కాదు ఆర్జేడీ చీఫ్ తేజస్వి యాదవ్ నేతృత్వంలోని కూటమే. మొదట్లో తేజస్వి నేతృత్వంలోని కూటమిని ముఖ్యమంత్రి నతీష్ కుమార్ నేతృత్వంలోని పాలక ఎన్డీయే కూటమి చాలా తేలిగ్గా తీసుకుంది. అయితే మొదటి దశ పోలింగ్ జరిగిన తర్వాతే తేజస్వీ విషయం ఏమిటో బయటపడింది. ఇక్కడే మహాగట్ బంధన్ లో ఆర్జేడీతో పాటు కాంగ్రెస్ సిపిఐ, సిపీఎం పార్టీలు కూడా ఉన్నప్పటికీ మొత్తం క్రెడిట్ అంతా తేజస్వీదే అని చెప్పాలి. ఎందుకంటే కూటమిలోని మిగిలిన పార్టీల పాత్ర పెద్దగా లేదు కాబట్టే. ఎన్నికల్లో ప్రధాన పాత్ర ఆర్జేడీదే కావటంతో మిగిలిన పార్టీలు కవలం సపోర్టింగ్ రోల్స్ మాత్రమే పోషించాయి. కూటమిలో సీట్ల సర్దుబాటు దగ్గర నుండి ఎన్నికల్లో ప్రచారం వరకు మొత్తం వ్యవహారమంతా తేజస్వీ చేతుల మీదుగానే జరిగింది. రోజుకు 20 నియోజకవర్గాల్లో బహిరంగసభలు, రోడ్డుషోలు నిర్వహించాడంటేనే తేజస్వి యాదవ్ ఎంతగా కష్టపడ్డాడో అర్ధమైపోతోంది.




ఇదే సమయంలో ప్రత్యర్ధి ఎన్డీయే ఎంత గట్టిగా ఉందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. 15 ఏళ్ళుగా ముఖ్యమంత్రిగా ఉన్న నితీష్ కుమార్ కు మద్దతుగా రాష్ట్రమంత్రులు, కేంద్రమంత్రులు, ఎంపిలతో పాటు ఇతర రాష్ట్రాల నేతలంతా ఎన్డీయేకి మద్దతుగా బీహార్ లోనే దాదాపు నెలరోజులుగా మోహరించారు. ఇదే సమయంలో ప్రధానమంత్రి నరేంద్రమోడి కూడా ఎన్నికల ప్రచార సభల్లో సుడిగాలి పర్యటనలు చేశారు. ఇది కాకుండా ఇంకోవైపు శివసేన, మరోవైసు శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ లు నువ్వా నేనా అన్నట్లుగా పోటి పడ్డాయి. వీళ్ళంతా చాలరన్నట్లుగా దివంగత కేంద్రమంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ కొడుకు చిరాగ్ పాశ్వాన్ నేతృత్వంలోని ఎల్జేపీ, మరో రెండు కూటములు అధికారం కోసం పోటి పడ్డాయి. మరి ఇంతమంది ప్రత్యర్ధులను తట్టుకుని తన కూటమిని గెలుపు గుర్రం ఎక్కించాలంటే ఎవరికైనా మామూలు విషయం కాదు.




అందుకనే తేజస్వి విషయమై అన్నీ మీడియా సంస్ధలు, సర్వే సంస్ధలు ప్రత్యేకంగా సర్వేలు నిర్వహించాయి. మొదటి విడత పోలింగ్ కాగానే మెజారిటి సీట్లు ఎంజీబీకే దక్కుతాయని తేలింది. అలాగే రెండోదశ పోలింగ్ లో కూడా ఎన్డీయే కూటిమికి ఆశించిన ఫలితాలు దక్కటం లేదని తేలిపోయింది. ఇక తాజాగా అంటే శనివారం మూడోదశ పోలింగ్ జరిగిన తర్వాత ఓటర్లనాడి తెలియగానే ఎగ్జిట్ పోల్స్ లో ఎంజీబీకే పట్టం అని ప్రకటించేశాయి. ఎగ్జిట్ పోల్స్ ప్రకారం 243 అసెంబ్లీ సీట్లలో ఎంజీబీ కంఫర్టబుల్ గా 124 సీట్లతో అధికారంలోకి వస్తుందట. టైమ్స్ నౌ-సీ ఓటర్ ప్రకారం ఎన్డీయేకి 116, ఎంజీబీకి 120 సీట్లొస్తాయి. పీపుల్స్ పల్స్-పీఎన్జీ ప్రకారం ఎంజీబీ కూటమికి 125 సీట్లు వస్తాయట. ఇక ఎన్డీయే కూటమికి 110 సీట్లొస్తాయి. చివరకు బీజేపీకి మద్దతుగి నిలబడే రిపబ్లిక్ టీవీ కూడా ఎంజీబీకి 138 సీట్లు వస్తాయని అంచనా వేసింది. ఇదే సమయంలో ఎన్డీయేకి 117 రావచ్చని తేల్చేసింది.




ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే సిఎంగా 40 తేజస్వికి 40 శాతం జనాలు ఓట్లేస్తే నితీష్ కు 34 శాతం మంది మాత్రమే ఓట్లేశారు. పోలింగ్ మొదలైన తర్వాత కానీ అధికార కూటమిపై జనాల్లో ఉన్న వ్యతిరేకత బయటపడలేదు. కరోనా వైరస్ నేపధ్యంలో వలసకార్మికులు, పెరిగిపోయిన నిరుద్యోగం, మోడిపై వ్యతిరేకత కూడా ఎంజీబీకి కలిసి వచ్చాయనేది ప్రాధమిక సమాచారం. ఏదేమైనా ఎగ్జిట్ పోల్స్ గనుక నిజమైతే తేజస్వి చరిత్ర సృష్టించినట్లే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: