మళ్లీ ప్రారంభం కానున్న పాడుతా తీయగా..!
పాడుతా తీయగా కార్యక్రమాన్ని కాపీ చేస్తూ... మిగిలిన ఛానల్స్ కూడా టాలెంట్ హంట్ చేపట్టినప్పటికీ... అవి అంతగా సక్సెస్ సాధించలేదు. ఏదో ఒకటి, రెండు నెలలు సాగినా... ఆ తర్వాత పాడుతా తీయగా ధాటికి నిలవలేకపోయాయి. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పరమపదించిన తర్వాత... పాడుతా తీయగా కార్యక్రమం ఆగిపోయింది. అయితే ఈ సంగీత ప్రయాణాన్ని కొనసాగించాలని ఈటీవీ యాజమాన్యం భావించింది. ఈ బాధ్యతలను ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కుమారుడు ఎస్పీ చరణ్కు అప్పగించారు. ఎస్పీబీ ప్రధమ వర్ధంతి సందర్భంగా ఈటీవీ యాజమాన్యం బాలుకు ప్రేమతో... పేరుతో ఓ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమానికి రామోజీ గ్రూప్ ఛైర్మన్.. రామోజీరావు... స్వయంగా జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ వేదికపైనే పాడుతా తీయగా తిరిగి ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమానికి... ఎస్పీ చరణ్ న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తారని ప్రకటించారు. పాడుతా తీయగా కార్యక్రమంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం వాడిన మైక్ను స్వయంగా ఎస్పీ చరణ్కు అందించారు రామోజీరావు. త్వరలోనే ఈ టాలెంట్ షో తిరిగి ప్రారంభం కానుంది.