రాతపరీక్ష, ఇంటర్వ్యూ లేని ఉద్యోగావకాశం?

Purushottham Vinay
ఇక యంత్ర ఇండియా లిమిటెడ్‌ నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్తని చెప్పింది.అదేంటంటే ఈ సంస్థ 5395 ట్రేడ్‌ అప్రెంటిస్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.ఇక మరో రెండు రోజుల్లో ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ అనేది ప్రారంభం కానుందని సమాచారం తెలుస్తుంది. ఇందులో ఐటీఐ, నాన్‌ ఐటీఐ అభ్యర్థులకు సంబంధించి ఈ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారని సమాచారం తెలుస్తోంది. మార్చి 28వ తేదీనా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా పరిగణించారు.ప్లస్ పాయింట్ ఏంటంటే ఎలాంటి రాతపరీక్ష, ఇంటర్వ్యూ లేకుండానే ఈ ఉద్యోగ ఖాళీల ఎంపిక ప్రక్రియ జరుగుతోంది. ఈ ఉద్యోగ ఖాళీలలో మొత్తం 3508 ఉద్యోగ ఖాళీలు ఐటీఐకు సంబంధించినవి కాగా  ఇంకా 1887 ఉద్యోగాలు నాన్ ఐటీఐకి సంబంధించినవి. ఇక బాయిలర్ అటెండెంట్, అటెండెంట్ ఆపరేటర్ కెమికల్ ప్లాంట్ ఉద్యోగాలతో పాటు కార్పెంటర్, ఎలక్ట్రీషియన్, మేసన్, ఎలక్ట్రోప్లేటర్, మెకానిక్, ఫౌండ్రీమ్యాన్ ఇంకా అలాగే ఇతర ఉద్యోగాలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తారు.


అయితే అర్హత విషయానికి వస్తే..కనీసం 50 శాతం మార్కులు సాధించి సంబంధిత ట్రేడ్ లో ఐటీఐ ఉత్తీర్ణులైన వాళ్లు ఈ పోస్టులకు సంబంధించి అర్హత కలిగి ఉంటారు. 15 సంవత్సరాల నుంచి 24 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు వీటికి అర్హులు కాగా అర్హతల ఆధారంగా వయో పరిమితిలో సడలింపులు కూడా ఉంటాయి. దరఖాస్తు ఫీజు ఓబీసీ ఇంకా ఓసీ అభ్యర్థులకు 200 రూపాయలు కాగా మిగిలిన వాళ్లకు మాత్రం 100 రూపాయలుగా నిర్ణయించారు.ఇక ఆన్ లైన్ ద్వారా ఈ పోస్టులని దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని సమాచారం తెలుస్తుంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు వెంటనే ఈ ఉద్యోగాల కోసం ఖచ్చితంగా దరఖాస్తు చేసుకోండి. నిరుద్యోగులకు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భారీ స్థాయిలో బెనిఫిట్ కలిగే అవకాశం కూడా ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: