నిరుద్యోగులకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ శుభవార్త చెప్పింది. కేంద్ర కార్మిక శాఖ పరిధిలోని ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (EPFO) లో అకౌంట్ ఆఫీసర్ సహా పలు ఉద్యోగాల భర్తీకి షార్ట్ నోటిఫికేషన్ ని జారీ చేయడం జరిగింది.ఇందులో భాగంగా మొత్తం 577 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్టు యూపీఎస్సీ షార్ట్ నోటిఫికేషన్ లో వెల్లడించింది. ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్లో ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ (ఈవో) ఇంకా అకౌంట్స్ ఆఫీసర్ (ఏవో) తో పాటుగా అసిస్టెంట్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ (APFC) ఉద్యోగాలను యూపీఎస్పీ భర్తీ చేయనుంది. ఈ పరీక్షకు సంబంధించిన పూర్తి నోటిఫికేషన్ ఓ నాలుగైదు రోజుల్లో విడుదలయ్యే అవకాశం ఉంది. ఇక పరీక్ష తేదీతో పాటు మిగతా అన్ని వివరాలను కూడా అతి త్వరలో upsc.gov.in / upsconline.nic.in ద్వారా నోటిఫికేషన్ విడుదల చేయనుంది. అందువల్ల ఈ ఉద్యోగాల గురించి మరింత స్పష్టత రానుంది.ఇక UPSC ఈ ఖాళీల కోసం ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనుంది.
ఇక వీటిలో ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ (ఈవో)/అకౌంట్స్ ఆఫీసర్(ఏవో) ఉద్యోగాలు 418 ఉండగా ఇంకా అలాగే అసిస్టెంట్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ పోస్టులు మొత్తం 159 ఉన్నాయి.ఇక ఆన్లైన్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ విషయానికి వస్తే.. ఫిబ్రవరి 25న మధ్యాహ్నం 12గంటల నుంచి స్టార్ట్ కానుంది. మార్చి 17న సాయంత్రం 6గంటలతో పూర్తి కానుంది.ఇక విద్యార్హత ఇంకా వయో పరిమితి విషయానికి వస్తే ఖచ్చితంగా ఏదైనా డిగ్రీ చేసి ఉండాలి. ఇక ఈవో/ఏవో ఉద్యోగాలకు 18 నుంచి 30 ఏళ్లు వయస్సు ఉండాలి. ఇంకా అలాగే ఏపీఎఫ్సీ పోస్టులకు మొత్తం 18 నుంచి 35 ఏళ్ల వరకు వయో పరిమితి వుంది.జనరల్, ఓబీసీ,ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.25 ఇంకా ఎస్సీ/ఎస్టీ/పీబ్ల్యూడీ/మహిళలకు ఫీజు లేదు. మీరు ఆన్లైన్లోనే ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.ఎంపిక ప్రక్రియ విషయానికి వస్తే..రాతపరీక్ష, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఇంకా మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా ఉంటుంది.