జగన్‌ ప్రభంజనం సృష్టించిన ఆ క్షణాలు?

నాలుగేళ్ల క్రితం  వైఎస్ జగన్ వైసీపీ పార్టీ సాధారణ ఎన్నికల్లో 151 స్థానాలను గెలుచుకొని విజయ దుంధబి మోగించింది. ముఖ్యంగా వైఎస్ జగన్ పాదయాత్ర ఎంతో కలిసొచ్చిందని చెప్పొచ్చు. అప్పటివరకు అన్ని తెలుగు మీడియా ఛానళ్లు చంద్రబాబు విజయం పక్క అని ఆయన తప్ప ఆంధ్రప్రదేశ్ కు మరో మార్గం లేదని తెగ ప్రచారం చేశాయి. లగడపాటి రాజగోపాల్ సైతం వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా చంద్రబాబు గెలుస్తాడని సర్వేలు చేసి మరీ చెప్పారు.  కొన్ని నేషనల్ మీడియాలు మాత్రం వైసీపీ గెలుస్తుందని చెప్పింది. సాక్షి కూడా గెలుపుకు అడ్డుపడుతున్నారని చెప్పింది. కానీ గెలుస్తున్నారని మాత్రం చెప్పలేకపోయారు.  

అలాంటి సందర్భంలో చంద్రబాబు నాయుడు మళ్ళీ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అవుతున్నారని అన్ని మీడియా ఛానళ్లు ఊదరగొట్టాయి.  రాత్రి ఒంటిగంట వరకు పోలింగ్ జరిగింది మహిళలు పెద్ద ఎత్తున పోలింగ్ కు హాజరయ్యారు. ఉదయం ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం కాగానే పోస్టల్ బ్యాలెట్లు కూడా టీడీపీకి అనుకూలంగా వచ్చాయి. ఇక ఏముంది కచ్చితంగా టీడీపీ విజయం సాధిస్తుందనుకున్నారు. కానీ మొదటి రౌండ్  ముగిసే సరికి వైసీపీ ఆధిక్యం లో  ఉండడం టీడీపీ 22 స్థానాలకు మాత్రమే  పరిమితం కావడంతో గెలుపు పై సందేహాలు నెలకొన్నాయి.

మూడు నాలుగు రౌండ్లు ముగిసే సరికి 150 స్థానాలతో ఆదిక్యంలోకి దూసుకెళ్లిపోయింది. దీంతో వైసీపీ  నాయకులు సంబరాలు చేసుకోవడం టీడీపీ నిరాశలో కూరుకుపోవడం జరిగింది. ముఖ్యంగా జనసేన పార్టీ సైతం పవన్ కళ్యాణ్ రెండు స్థానాలు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోవడంతో ఆ పార్టీ కార్యకర్తలు తీవ్ర నిరాశలో కూరుకుపోయారు. చివరి ఫలితం నెల్లూరు అసెంబ్లీ స్థానం నారాయణ, అనిల్ యాదవ్ ల మధ్య పోటాపోటీ నెలకొంది అందులో అనిల్ యాదవ్ కూడా గెలవడం వైసీపీ శ్రేణులను ఎంతో ఆశ్చర్యానికి గురి చేసింది. అదేవిధంగా వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడం జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: