ఏపీ సీఎం సీట్.. మళ్లీ కాపులకు నిరాశ తప్పదా?
కాపు సామాజిక వర్గం ప్రస్తుత ఆలోచనలు ఏంటి.. గతంలో రంగను ఆదరించారు. తర్వాత చిరంజీవిని కూడా గెలిపించినా ఆయన సీఎం కాలేక పోయారు. . అనంతరం జరిగిన రాజకీయ పరిణామాలతో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశారు. మళ్లీ కాపు నాయకుల ముఖాలు వెలుగులీనడానికి కారణం పవన్ కల్యాణ్. ఎందుకంటే పవన్ ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ తర్వాత ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నారు. చిరంజీవి ఆనాడు కాపు నాయకుడిని అనే పదాలు వాడలేరు. కాపులందరూ కలిసి నిలబడాలని పవన్ కోరారు. కానీ ప్రస్తుతం చంద్రబాబును సీఎం చేయడానికి పవన్ సిద్ధపడుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
తెలంగాణలో కాంగ్రెస్ తెలుగుదేశం ప్రత్యర్థులుగా ఉండేవారు. అలాంటి వారు గత సారి ఎన్నికల్లో పొత్తు పెట్టుకుంటే బోల్తాపడ్డారు. అలాగే ఆంధ్రప్రదేశ్ లో కమ్మ, కాపు వారు ఎన్నో ఏళ్లుగా ప్రత్యర్థులుగా ఉంటున్నారు. ఇలాంటి సమయంలో కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకులు ఎలా స్పందిస్తారనేది చూడాల్సిన అంశం. కమ్మ, కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకులు అందరూ కలిసి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు. పవన్ నే సీఎంగా గెలిపించడానికి మొగ్గు చూపుతారా.. లేక సీనియర్ చంద్రబాబును గెలిపించడానికి ఒప్పుకుంటారా.. ఏదేమైనా ఆంధ్రలో కుల రాజకీయాల జోరు కొనసాగుతూనే ఉంది.