జేడీ లక్ష్మీనారాయణ.. జోకర్‌ అవుతున్నారా?

జెడి లక్ష్మి నారాయణ విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి ఇటీవల కీలకమైన వ్యాఖ్యలు చేశారు. తలా 100 రూపాయలు నాలుగు నెలలు కడితే స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటు పరం కాకుండా ఆపొచ్చు. దీని కోసం బిడ్ కూడా వేసినట్లు చెప్పారు. అయితే జెడీ లక్ష్మినారాయణపై టీడీపీ అధికార ప్రతినిధి విజయ్ కుమార్ కీలక ప్రశ్నలు లేవనెత్తారు. విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి బిడ్ డ్రామాలు చేయడం ఏమిటి అని విమర్శించారు. 2021-22 28500 కోట్ల టర్నోవర్ ఉన్న స్టీల్ ప్లాంట్ ను వెనెప్పా విజయవాడకు కొనియ్యాలని ప్రయత్నాలు చేస్తున్నారా మీరు అంటూ జెడీపై నిప్పులు చెరిగారు. అసలు వెనెస్పా అనే సంస్థ ఏం పని చేస్తుంది తెలుసా అని ప్రశ్నించారు.

సిలికా పౌడర్, చిల్లి పౌడర్, నార్మల్ పౌడర్ లాంటి తయారు చేసే సంస్థలకు ఇవ్వలాని చూస్తారా? వెనెస్సా అనే కంపెనీ టర్నోవర్ ఏడాదికి రూ. 10 వేల కోట్లు. పోతిని వెంకటరామరావుతో కొనిపించేస్తావా అని మండిపడ్డారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ స్థాయి ఎంటో తెలుసా.. 2 లక్షల కోట్ల విలువ చేసే స్టీల్ ప్లాంట్, 6500 ఆఫీసర్లు, 12 వేల మంది రెగ్యూలర్ వర్కర్లు, 20 వేల మంది కాంట్రాక్టు వర్కర్లు, 45 మిలియన్ల స్టీల్ తయారీ చేసే అతి పెద్ద కంపెనీని కేవలం 10 వేల కోట్ల టర్నోవర్ ఉన్న సంస్థకే అప్పజెప్పాలని చూస్తారా అని జెడీపై విరుచుకుపడ్డారు.

బిడ్డింగ్ ప్రిలిమినరీ ఎసెస్ మెంట్ లో మొదటి రౌండ్ లోనే తీసేస్తారు. అప్పుడు చూడండి నేను బిడ్ వేశాను కానీ అది జరగనీయలేరని జేడీ అంటారని అన్నారు. మీకు బిడ్డింగ్ లో చోటే ఉండదు. ఇంతవరకు జెడీ లాంటి వ్యక్తిపై ఇలాంటి విమర్శలు చేసిన వ్యక్తి ఎవరూ లేరు. మరి ఇలాంటి కామెంట్లపై జెడీ ఎలా స్పందిస్తారు. ఏయే విషయాలు చెబుతారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

jd

సంబంధిత వార్తలు: