వైసీపీ నుంచి 30 మంది లీడర్స్ టీడీపీకి జంపింగ్‌?

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుండి తెలుగుదేశం పార్టీకి, అది కూడా అధికారం పక్షంలో ఉన్నప్పుడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 23 మంది వచ్చినా, నలుగురు ఎంపీలు వచ్చినా అదో లెక్క. కానీ అధికార పక్షంలో ఉన్నప్పుడు కూడా ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు దగ్గరికి వెళ్లడం వెనకాల, మరో అవకాశం ఇవ్వమని తేల్చి చెప్పిన నేపద్యంలో అక్కడ ఇన్చార్జిలుగా కూడా వేసేశారు. అలాగని జగన్ తీసేసిన వాళ్ళకి టికెట్స్ ఇవ్వడానికి, ఇద్దరికి ఆల్రెడీ టిడిపి తో టచ్ లో ఉన్నారు మిగతా రెండు అయితే కనుక టికెట్స్ ఇవ్వలేదు తెలుగుదేశం పార్టీ.

కానీ 5-10 కోట్ల వరకు డబ్బులు ఇచ్చారని ప్రచారం అయితే జరుగుతుంది. అది వైసీపీ చేస్తుందని సేమ్ టైం బయట  టాక్ కూడా ఉంది. ఎందుకంటే ఎలాగో నెక్స్ట్ టైం ఎమ్మెల్యే టికెట్ రాదు. క్రిందటి సారి ఖర్చు పెట్టుకున్నది ఎంతో కొంత రికవరీ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో ఆ డబ్బులకు బేరం ఆడుకున్నారనే కాన్సెప్ట్ ఒకటి ఉంది. అది నిజమో కాదో దేవుడికెరుక.

కాకపోతే ఇప్పుడు అసలు సమస్య ఏమి ఎదురవుతుందంటే ఎంతమంది వెళ్లిపోతారు అనేది. ఖచ్చితంగా అయితే జగన్మోహన్ రెడ్డి ఎంతమందికి టికెట్స్ ఇవ్వనంటారో, ఎంతమంది మీద చర్యలు తీసుకుంటారో వాళ్ళలో కనీసం 50 నుండి 60 శాతం వెళ్లిపోవడానికి సిద్ధంగా ఉన్నారని తెలుస్తుంది.  గెలవడానికి అవకాశం ఈ పార్టీలో లేకపోతే మరో పార్టీలో, తెలుగుదేశం జనసేన కలుస్తాయి అంటున్నారు కాబట్టి అక్కడున్న కుల సమీకరణాలతో గెలుస్తామేమో అనుకుని తెలుగుదేశం పార్టీ తరపున టికెట్ ఉంటే వెళ్లిపోవడానికి సిద్ధంగా ఉన్నారు.

ఇట్లాంటి వాళ్ళు రాబోయే రోజుల్లో 30-40 మంది దాకా ఉంటారని, అందులో కొంత మంది తగ్గినా కానీ అదే రేంజ్ లో సంఖ్య అయితే ఉంటుందని తెలుస్తుంది. అయితే అంతమందికి టికెట్స్ లేకుండా చేస్తే బైటకు వెళ్లిపోడానికి సిద్ధపడతారు, ఒకవేళ ఇస్తే ఆగేటి పరిస్థితి ఉందని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: